News July 28, 2024
NZB: అనర్హులు.. దర్జాగా పింఛన్లు పొందుతున్నారు!
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కొందరు అనర్హులు మాత్రం దర్జాగా పింఛన్లు పొందుతున్నారు. సర్వీస్ పింఛన్తో పాటు ఆసరా పింఛన్లను ఏళ్లుగా తీసుకుంటున్న 555 మందిని అధికారులు ఇటీవల గుర్తించారు. వీరికి పింఛన్లను నిలిపివేయించి, నోటీసులు జారి చేశారు. కొందరి నుంచి డబ్బులు రికవరీ చేశారు. కాగా.. ఈ వ్యవహారంలో ప్రభుత్వం రూ. 3.63 కోట్లు నష్టపోయింది.
Similar News
News October 8, 2024
బోధన్: స్నేహితుడిపై కోపంతో సొంత వాహనానికి నిప్పు
బోధన్ పోలీస్ స్టేషన్ ఎదుట సాయిలు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని తానే తగలబెట్టుకున్నాడు. తన స్నేహితుడు శంకర్ పదేళ్ల క్రితం రూ.70 వేలు తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. తిరిగి ఇవ్వమని కోరితే ఎలాంటి స్పందన లేకపోవటంతో పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయం తమ పరిధిలోకి రాని అంశమని పోలీసులు సూచించగా తనకు న్యాయం జరిగే వరకూ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లేది లేదని తన బైకును సాయిలు తగలబెట్టుకున్నాడు.
News October 8, 2024
వర్గపోరును ప్రోత్సహిస్తే ఊరుకునేది లేదు: ఈరవత్రి అనిల్
వర్గపోరును ప్రోత్సహిస్తే ఇక నుంచి ఊరుకునేది ప్రసక్తే లేదని, అందరూ కలిసి కట్టుగా కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేయాలనిTGMDC ఛైర్మన్ ఈరవత్రి అనిల్ అన్నారు. వేల్పూర్ AMC నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరైన ఆయన మాట్లాడారు. పదేళ్లుగా పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకు పదవులు వస్తుంటే చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గుర్తిస్తుందన్నారు.
News October 7, 2024
KMR: ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలని CMO సీనియర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. KMR కలెక్టరేట్లో కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు నిర్వహిస్తున్నామని, ప్రతీ కుటుంబం సమాచారాన్ని సేకరించాలన్నారు. ధాన్యం సేకరణపై ఆయన సమీక్షించారు.