News February 28, 2025

NZB: అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ సిద్ధాంతాలు: TPCC చీఫ్

image

అభివృద్ధి, సంక్షేమం, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు. శుక్రవారం గాంధీ భవన్లో జరిగిన TPCC విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ర్ట వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సూచనలు, సలహాలను పాటిస్తూ పార్టీ కోసం శ్రమిద్దామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాటపై ప్రజలకు నమ్మకముందన్నారు.

Similar News

News March 16, 2025

NZB: యాక్సిడెంట్.. బోల్తా పడ్డ కారు

image

నిజామాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జీజీ కాలేజీ సమీపంలో బైపాస్‌పై ఓ బాలుడు సైకిల్ మీద వచ్చాడు. సైకిల్‌ను తప్పించే ప్రయత్నంలో బాలుడిని కారు ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి బోల్తాపడింది. సైకిల్ పై ఉన్న బాలుడితో సహ కారులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 16, 2025

ఆదిలాబాద్-ఆర్మూర్ లైన్‌కు మోక్షం ఎప్పుడో…?

image

ఆదిలాబాద్-ఆర్మూర్ రైల్వే లైన్ ఏర్పాటుచేయాలని రెండు జిల్లాలకు చెందిన ప్రజలు కోరుతున్నారు. ADB నుంచి నిర్మల్, ఆర్మూర్, నిజామాబాద్‌కు నిత్యం భారీ సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వెంటనే ADB-ARMR రైల్వే లైన్ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. అయితే రైల్వే‌లైన్ ఏర్పాటుచేయలేని ప్రభుత్వాలు ఎయిర్‌పోర్టు తెస్తామంటున్నాయని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

News March 16, 2025

మోపాల్: సూర్యుడిలా వెలిగిపోతున్న చంద్రుడు

image

నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో శనివారం రాత్రి 8గంటల సమయంలో చంద్రుడిలా కాకుండా సూర్యుడిలా కాంతులు వెదజల్లుతూ చంద్రుడు దర్శనమిచ్చాడు. ఆకాశంలో ఈ అద్భుత దృశ్యం కనిపించడంతో అందరిని ఈ దృశ్యం ఆకట్టుకుంది. సూర్యుడు లాగా చంద్రుడు వెలగడం అనేది మొదటిసారిగా చూస్తున్నామని మోపాల్ గ్రామస్థులు తెలిపారు.

error: Content is protected !!