News March 12, 2025
NZB: ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

నిజామాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఏసీబీ అధికారుల బృందం బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి తనిఖీలు చేపడుతోంది. ప్రధాన గేటుకు తాళం వేసి సోదాలు చేస్తున్నారు. పలువురు ఏజెంట్లు లోపల ఉండగా ఈ దాడి జరిగింది. కాగా ఈ కార్యాలయం పరిధిలో పలువురు అధికారులు ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలోనే ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది.
Similar News
News March 13, 2025
భీమ్గల్: రక్తం వచ్చేలా కొట్టిన ఉపాధ్యాయుడు

బాలుడిని ఉపాధ్యాయుడు కొట్టి గాయపరిచిన ఘటన భీమ్గల్ మండలం పల్లికొండ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం చోటు చేసుకుంది. తల్లిదండ్రుల ప్రకారం.. గ్రామానికి చెందిన రిషి తరగతి గదిలో అల్లరి చేశాడని ఉపాధ్యాయుడు తీవ్రంగా కొట్టాడు. దీంతో తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. వెంటనే ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించామన్నారు. టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని NSUI జిల్లా వైస్ ప్రెసిడెంట్ రెహమాన్ డిమాండ్ చేశారు.
News March 13, 2025
UPDATE: ACB సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం

NZB రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూళ్లు జరుగుతున్న వైనాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. బుధవారం సుదీర్ఘంగా జరిపిన సోదాల్లో ఏజెంట్ ఖలీల్ నుంచి రూ.27వేల లెక్కచూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి నుంచి 14 వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలను, ముగ్గురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్లను జప్తు చేశారు. ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయమై విచారణ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
News March 13, 2025
NZB: నేడు సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు

నిజామాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 13న సీనియర్ పురుషుల హాకీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు రమణ, గంగారెడ్డి తెలిపారు. ఈ ఎంపికలు ఆర్మూర్లోని మినీ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఎంపికైన జిల్లా జట్టును ఈ నెల 16 నుంచి 18 వరకు కరీంనగర్లోని హుజూరాబాద్లో జరిగే అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్కు పంపుతామన్నారు.