News February 7, 2025
NZB: ఆస్తి పన్ను వసూలు చేయాలి: కమిషనర్

నిర్లక్ష్యం చేయకుండా నగరంలో ఆస్తి పన్ను వసూలు చేయాలని నిజామాబాద్ నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ ఆదేశించారు. ఆయన నగరపాలక సంస్థ స్పెషల్ టీం ఆఫీసర్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, సపోర్టింగ్ సిబ్బందితో సమావేశమై ఆస్తిపన్ను విషయంలో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భారీగా పెండింగ్లో ఉన్న వారి నుంచి త్వరితగతిన పన్ను వసూలు చేసేలా చూడాలన్నారు.
Similar News
News March 23, 2025
నిజామాబాద్ జిల్లాలో తగ్గిన ఎండ తీవ్రత

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత తగ్గింది. వేసవి కాలం అయినా.. శనివారం కోటగిరిలో అత్యధికంగా 38.5℃ ఉష్ణోగ్రత నమోదైంది. కమ్మర్పల్లి 38.3, ఏర్గట్ల, నందిపేట 38.1, నిజామాబాద్ సౌత్, వైల్పూర్ 38, మక్లూర్ 37.9, మోర్తాడ్, ముప్కల్ 37.6, జక్రాన్పల్లె, టోండకుర్, ఏడపల్లి 37.4, చిన్నమావంది 37.2, సాలూర 36.9, చిమన్పల్లె, మదన్పల్లె 36.8, ఇస్సాపల్లి 36.4, లక్మాపూర్ 36.1, కోరాట్పల్లిలో 36℃ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 23, 2025
NZB: చెల్లి మృతి.. బాధలోనూ పరీక్ష రాసిన అన్న

ఓ వైపు చెల్లి మరణం.. మరో వైపు ‘పది’ పరీక్షలు. ఆ పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాశారు నిజామాబాద్కు చెందిన లక్ష్మీ గణ సాయి. ఆదర్శనగర్లోని పానుగంటి సాయిలు-వినోద దంపతులకు కుమారుడు లక్ష్మీ గణ సాయి, కుమార్తె పల్లవి సంతానం. అయితే పల్లవి 2 నెలల క్రితం క్యాన్సర్ బారినపడి శుక్రవారం రాత్రి మరణించగా, ఆ వార్త దిగమింగుకొని అన్న శనివారం పదో తరగతి పరీక్ష రాశారు. దుఃఖంలోనూ పరీక్ష రాసిన అన్న గ్రేట్ కదా..!
News March 23, 2025
NZB: ఆరుగురు మృతి.. 17 మందిపై కేసులు

నిజామాబాద్ జిల్లాలో శనివారం తీవ్ర విషాదం నింపింది. ఒక్కరోజే వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, అలాగే పలు ఘటనల్లో 17 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. చేపల వేటకు వెళ్లి, వాహనం ఢీకొని, గొడవ పడటవంతో హత్య, జ్వరంతో యువకుడు, చెట్టు పైనుంచి పడి, నిజాంసాగర్ కాలువ వద్ద ఒకరు మృతిచెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అలాగే జూదం, న్యూసెన్స్ ఘటనల్లో 17 మందిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.