News February 28, 2025
NZB: ఇంటర్మీడియట్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీఐఈఓ

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు DIEO తిరుమలపుడి రవికుమార్ తెలిపారు. మార్చ్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పరీక్షల నిర్వహణ కోసం శుక్రవారం నగరంలోని ఖిల్లా జూనియర్ కళాశాలలో చీఫ్ సూపర్రింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారుల సమావేశం నిర్వహించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాల నిఘాలోనే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 17, 2025
NZB: ఒక్క ఓటు తేడాతో గెలుపు

నందిపేట్ మండలం కంఠం సర్పంచ్గా సాయినాథ్ గెలుపొందారు. బుధవారం నందిపేట మండలంలో జీపీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ భరితంగా సాగాయి. బీజేపీ బలపరిచిన అభ్యర్థి సాయినాథ్ 712 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి ఇంద్రుడుకు 711 ఓట్లు వచ్చాయి. దీంతో సాయినాథ్ కేవలం ఒక్క ఓటుతో సర్పంచ్గా గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో కంఠం గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
News December 17, 2025
నిజామాబాద్ జిల్లా మూడో విడత తొలి ఫలితం

కమ్మర్పల్లి మండల పరిధిలోని 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. రాజ రాజేశ్వరి నగర్ సర్పంచిగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి తైద సుశీల-సాయన్న విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై 33 ఓట్లతో గెలుపొందారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.
News December 17, 2025
NZB: ఒంటి గంట అప్డేట్ 74.36 శాతం పోలింగ్

తుది దశ GP ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 12 మండలాల్లోని 165 GPల్లో 146 SPలకు, 1130 WM లకు నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది. ఆలూర్ 75.37%, ఆర్మూర్-74%, బాల్కొండ-63.25%, భీమ్గల్-73.18%, డొంకేశ్వర్-77.39%, కమ్మర్పల్లి-72.85%, మెండోరా-76.29%, మోర్తాడ్-75.87%, ముప్కాల్-76.61%, నందిపేట్-78.04%, వేల్పూర్-75.01%, ఏర్గట్ల-75.92% పోలింగ్ నమోదైనట్లు వివరించారు.


