News March 17, 2025

 NZB: ఇంటర్ పరీక్షలు.. 831 మంది గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో సోమవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షకు మొత్తం 831 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో మొత్తం 20,110 మంది విద్యార్థులకు గాను 19,279 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా, నేటి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని రవి కుమార్ వివరించారు.

Similar News

News October 15, 2025

భీమ్‌గల్: మూడేళ్ల చిన్నారి మృతి (UPDATE)

image

స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బాలుడు మృతి చెందిన ఘటన భీమ్‌గల్ మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్ఐ సందీప్ వివరాలు.. రహత్ నగర్‌కు చెందిన శిరీష తన పెద్ద కుమారున్ని స్కూల్ బస్సు ఎక్కిస్తుంది. ఆ సమయంలో చిన్న కొడుకు శ్రీకాంత్(3) బస్సు ముందుకు వెళ్లాడు. డ్రైవర్ గమనించకుండా బాలున్ని బస్సుతో ఢీకొట్టాడు. తలకి తీవ్ర గాయాలైన బాలుడు మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ చెప్పారు.

News October 15, 2025

TU: డిగ్రీ పరీక్ష ఫీజు నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ పరీక్షల ఫీజు తేదీని వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొ.కే.సంపత్ కుమార్ మంగళవారం ప్రకటించారు. B.A/B.Com/BSC/BBA/BCA I, III, Vవ సెమిస్టర్(రెగ్యులర్), II,IV,VI సెమిస్టర్ (బ్యాక్లాగ్ 2021-2024) విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఈ నెల 25వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. అపరాధ రుసుం రూ.100తో ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉందన్నారు.

News October 15, 2025

NZB: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల విద్యార్థుల సంక్షేమానికి చర్యలు

image

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. HYD నుంచి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలన్నారు.