News December 30, 2024
NZB: ఈ ఏడాది క్రైమ్ రేట్ వివరాలు ఇలా..
NZB జిల్లాలో ఈ ఏడాదికి సంబంధించిన కేసుల వివరాలను ఇన్ ఛార్జ్ CP సింధు శర్మ వెల్లడించారు. శారీరక నేరాలు, ఆస్తి నేరాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఎక్కువే అయ్యాయి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ, మృతి చెందిన కేసులు, సైబర్ నేరాలు, పోక్సో, మిస్సింగ్, గేమింగ్ ఆక్ట్ కేసులు కూడా ఎక్కువగానే నమోదయ్యాయి. గతేడాది 356 ఆత్మహత్యలు జరగగా ఈ యేడు 442 జరిగాయి. గాంజా కేసులు 22 నమోదు కాగా 58 మందిని అరెస్ట్ చేశామన్నారు.
Similar News
News January 19, 2025
ఎంపీ అర్వింద్కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటు: కవిత
నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు వెకిలి మాటలు మాట్లాడడం అలవాటని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ తాము పసుపు బోర్డు డిమాండ్ చేసే నాటికి అర్వింద్ అసలు రాజకీయాల్లో లేరని, కాంగ్రెస్ పార్టీలో ఆయన తండ్రి చాటు బిడ్డగా ఉన్నారని విమర్శించారు. ఎంపీ అర్వింద్ వెకిలి మాటలు మాట్లాడడం మానేయాలని ఆమె సూచించారు.
News January 19, 2025
NZB: నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం NZB రానున్నారు. రోడ్డు మార్గంలో ఉదయం 10 గంటలకు నిజామాబాద్ కలెక్టరేట్కు చేరుకునే ఆయన అక్కడ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2.30కు పోలీస్ కమిషనరేట్లో భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం రూ.380 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేసి గూపన్పల్లిలో, నగరంలో బహిరంగ సభల్లో మాట్లాడి హైదరాబాద్ తిరుగపయనమవుతారు.
News January 19, 2025
నేడు నిజామాబాద్కు డీజీపీ
తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) డాక్టర్ జితేందర్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వెనుక ఏర్పాటు చేస్తున్న భరోసా సెంటర్ను మధ్యాహ్నం 2:30 గంటలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణా రావు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో DGP పాల్గొంటారు. ఇందు కోసం జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది.