News February 6, 2025

NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు 

image

సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.

Similar News

News October 23, 2025

రాష్ట్రస్థాయి పోటీల్లో NZB క్రీడాకారులకు మెడల్స్

image

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అండర్ 19 రెజ్లింగ్ పోటీల్లో NZB క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 గోల్డ్ మెడల్స్ 3 రజత పథకాలు సాధించారని కోచ్ సంతోష్ తెలిపారు. సఫీయా 76kg విభాగంలో కృష్ణ 65KG విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

News October 23, 2025

NZB: దివ్యాంగ విద్యార్థులు దరఖాస్తు చేసుకోండి

image

దివ్యాంగ విద్యార్థులు స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ అధికారిణి రసూల్ బీ తెలిపారు. 9, 10వ తరగతి విద్యార్థులకు ప్రీ మెట్రిక్, ఇంటర్ లేదా ఆపై చదువుతున్న వారికి పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్ జాతీయ స్థాయిలో మంజూరు చేస్తామన్నారు. ఇందుకోసం www.scholarships.gov.in వెబ్సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 23, 2025

NZB: వైన్స్‌ దరఖాస్తులకు నేడే లాస్ట్

image

మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో ముగియనుందని నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. నిన్నటి వరకు జిల్లా వ్యాప్తంగా 102 మద్యం షాపులకు 2,658 దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. కాగా ఈ నెల 27న భారతి గార్డెన్‌లో మద్యం దుకాణాల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించనున్నారు.