News April 4, 2025
NZB: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

నిజామాబాద్ నగరంలోని గాయత్రీ నగర్లో ఎర్రమల పవన్ రాజు(25) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు 4వ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడు నగరంలోని ఒక బట్టల షాపు వేర్ హౌస్లో పని చేసేవాడు. అక్కడ పని చేసే అతడి స్నేహితురాలు వ్యక్తిగత కారణాలతో మృతి చెందగా నాటి నుంచి మానసికంగా కుంగిపోయాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోగా కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
Similar News
News April 15, 2025
ఆర్మూర్: చెరువులో పడి వ్యక్తి మృతి

చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆర్మూర్లో జరిగింది. CI సత్యనారాయణ తెలిపిన వివరాలు.. ఆలూరు రోడ్కు చెందిన కుంట గంగామోహన్ రెడ్డి(65) సోమవారం సాయంత్రం బట్టలు ఉతికేందుకు గుండ్ల చెరువుకి వెళ్లాడు. అనంతరం ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News April 15, 2025
NZB : డంపింగ్ యార్డ్ను పరిశీలించిన కమిషనర్

నాగారంలోని డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదానికి గురైన నేపథ్యంలో సోమవారం రాత్రి యార్డును నిజామాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. సెక్యూరిటీ తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. పొగ కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలుగుతోందని అక్కడి కాలనీవాసులు ఆదివారం మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.
News April 15, 2025
KMR: కుమారుని పెళ్లి.. తండ్రి మృతి

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం శివయ్య పల్లి గ్రామంలో సోమవారం కుమారుడి వివాహ వేడుకల్లో తండ్రి మృతి చెందడం కలకలం రేపింది. గజ్జెల వెంకటి(57) అతని కుమారుని పెళ్లి వేడుకలో ఫంక్షన్ హాల్లో పని చేస్తుండగా 11KV విద్యుత్ తీగలు తగలడంతో కరెంట్ షాక్కు గురై మృతి చెందాడు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పుష్పరాజు తెలిపారు.