News January 11, 2025
NZB: ఎంపీ అర్వింద్ను కలిసిన బీజేపీ మండలాధ్యక్షులు
నూతనంగా నియమితులైన వివిధ మండలాల అధ్యక్షులు శనివారం హైదరాబాద్లోని ఎంపీ అర్వింద్ ధర్మపురిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ జిల్లాలో బీజేపే ఎదుగుదలకు తమవంతు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి పాల్గొన్నారు.
Similar News
News January 26, 2025
NZB: బాలికల కళాశాల విద్యార్థినికి మొదటి బహుమతి
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.
News January 26, 2025
NZB: తొర్లికొండ ZPHS విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
తొర్లికొండ ZPHS విద్యార్థి శ్రావ్య జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-19లో జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈ నెల 24 నుంచి 28 వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం శంభాజీ నగర్ (మహారాష్ట్ర)లో జరిగే 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-19 పోటీల్లో పాల్గొననున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ గంగా మోహన్ తెలిపారు.
News January 26, 2025
NZB: జాతీయ క్రీడలకు డీసీడీఎంగా జిల్లా వాసి
ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖాండ్లో జరగనున్న నేషనల్ గేమ్స్కు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఈగ సంజీవ్ రెడ్డి డిప్యూటీ చీఫ్ డి మిషన్గా నియమితులయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరిని డిప్యూటీ చీఫ్ డి మిషన్గా నియమించగా జిల్లాకు చెందిన ఈగ సంజీవ్ రెడ్డి నియమితులవడం విశేషం. సంజీవరెడ్డి నియామకంపై జిల్లా క్రీడాసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.