News June 4, 2024

NZB: ఎమ్మెల్యేగా ఓడి.. ఎంపీగా గెలిచి..!

image

నిజామాబాద్ లోక్‌సభ సెగ్మెంట్ సిట్టింగ్ బీజేపీ ఎంపీగా ఉన్న ధర్మపురి అరవింద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కోరుట్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. కాగా ప్రస్తుతం జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రత్యర్థి అభ్యర్థి జీవన్ రెడ్డి పై భారీ మెజార్టీతో విజయ ఢంకా మోగించారు.

Similar News

News December 11, 2025

NZB: మొదటి రెండు గంటల్లో 19.80 శాతం పోలింగ్

image

తొలి దశ ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు 164 GPల్లో నమోదైన పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా
బోధన్ మండలంలో 26.26%,
చందూరు-16.63%
కోటగిరి- 17.76%
మోస్రా-15.42%
పోతంగల్- 19.76%
రెంజల్- 23.99%
రుద్రూరు-10.38%
సాలూర- 24.30%
వర్ని-19.62%
ఎడపల్లి-20.48%
నవీపేట -17.07% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వివరించారు.

News December 11, 2025

నిజామాబాద్ జిల్లాలో 7.5°C అత్యల్ప ఉష్ణోగ్రత

image

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో గోపన్నపల్లి 7.5°C,సాలురా 8.0,కోటగిరి 8.2, చిన్న మావంది 8.3, మదన్ పల్లి 8.7,పోతంగల్,మెండోరా,జకోర 8.9, ఏర్గట్ల 9.1,మంచిప్ప,డిచ్ పల్లి, కందుర్కి 9.4, కమ్మర్ పల్లి,నిజామాబాద్ 9.5,గన్నారం 9.7,మోర్తాడ్, కోన సముందర్ 9.8,చందూర్, మోస్రా 9.9°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

News December 10, 2025

1,384 మందితో బందోబస్తు: NZB సీపీ

image

బోధన్ రెవెన్యూ డివిజన్‌లో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు NZB సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. 1,384 మంది పోలీసు సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటుహక్కు వినియోగించాలని సూచించారు. ఎవరైనా గొడవలకు ప్రేరేపిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసరాల్లో డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.