News January 8, 2025
NZB: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించిన నేతలు

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావడం, అక్కడి పుస్తకంలో సంతకం చేసేందుకు చూడగా ఆయన పేరు లేకపోవడంతో అలిగి స్టేజ్ దిగిపోయారు. దీనితో కాంగ్రెస్ నాయకులు ఆయన్ను బుజ్జగించి తిరిగి స్టేజి పైకి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News December 9, 2025
నిజామాబాద్: ఈరోజు సాయంత్రం నుంచి మైకులు బంద్

నిజామాబాద్ జిల్లా బోధన్, ఎడపల్లి, సాలూర, నవీపేట్, రెంజల్, వర్ని, చందూర్, మోస్రా, కోటగిరి, పొతంగల్, రుద్రూర్ మండలాల్లోని 184 పంచాయతీలకు మొదటి విడతలో భాగంగా 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రచారం గడువు నేటి సాయంత్రంతో ముగియనుంది. దీంతో అభ్యర్థులు, వారి బంధువులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ తమకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. ప్రతి ఓటరును కలుస్తూ క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
News December 8, 2025
నిజామాబాద్: వారంరోజుల్లో 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన విస్తృత తనిఖీల్లో మొత్తం 150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య తెలిపారు. ఆర్మూర్, బోధన్ డివిజన్లతో పాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు నిర్వహించారు.
News December 8, 2025
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రత: సీపీ సాయి చైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు సీపీ పి. సాయి చైతన్య నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 1,384 మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో నిమగ్నం చేశారు. మూడు చెక్ పోస్ట్లను నెలకొల్పి, 361 లీటర్ల లిక్కర్ను సీజ్ చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 183 మందిని బైండోవర్ చేసి, నియమావళి ఉల్లంఘించినందుకు మూడు కేసులు నమోదు చేశారు.


