News January 8, 2025
NZB: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించిన నేతలు

నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ స్థాయి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ రావడం, అక్కడి పుస్తకంలో సంతకం చేసేందుకు చూడగా ఆయన పేరు లేకపోవడంతో అలిగి స్టేజ్ దిగిపోయారు. దీనితో కాంగ్రెస్ నాయకులు ఆయన్ను బుజ్జగించి తిరిగి స్టేజి పైకి తీసుకెళ్లడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Similar News
News December 20, 2025
ఇందూరు: పెరిగిన ఉష్ణోగ్రతలు.. తగ్గని చలి

నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కనిష్ఠంగా 16.1 డిగ్రీల సెల్సియస్, గరిష్ఠంగా 30.7 డిగ్రీలు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయ్యాయి. చలివాతావరణం కొనసాగుతుండటంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం, రాత్రి వేళల్లో చలి ప్రభావం ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
News December 20, 2025
నేషనల్ ఫుట్బాల్ టోర్నీకి నిజామాబాద్ జిల్లా క్రీడాకారుణులు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీకి NZB జిల్లా క్రీడాకారుణులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన హరిణి యాదవ్, పూర్విక U-14 విభాగంలో, జాహ్నవి యాదవ్, సాయి సమీక్ష U-17 విభాగంలో ఎంపికయ్యారు. U-14 విభాగంలో ఎంపికైన వారు కాశ్మీర్లో, U-17 విభాగంలో ఎంపికైన వారు కేరళలో జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటారు.
News December 20, 2025
నేషనల్ ఫుట్బాల్ టోర్నీకి నిజామాబాద్ జిల్లా క్రీడాకారుణులు

స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న జాతీయస్థాయి ఫుట్బాల్ టోర్నీకి NZB జిల్లా క్రీడాకారుణులు ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచిన హరిణి యాదవ్, పూర్విక U-14 విభాగంలో, జాహ్నవి యాదవ్, సాయి సమీక్ష U-17 విభాగంలో ఎంపికయ్యారు. U-14 విభాగంలో ఎంపికైన వారు కాశ్మీర్లో, U-17 విభాగంలో ఎంపికైన వారు కేరళలో జరిగే జాతీయ స్థాయి టోర్నీలో పాల్గొంటారు.


