News March 27, 2025

NZB: ఏప్రిల్‌ 9 వరకు పంటలకు సాగునీరు

image

ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టు పంటలకు ఏప్రిల్‌ 9 వరకు చివరి తడి కింద సాగునీరు అందిస్తామని ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ ఉన్నతస్థాయి కమిటీ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సూక్ష్మ నీటి లిఫ్ట్‌ స్కీం కింద ఆయకట్టుకు ఏప్రిల్‌ 9 ఉదయం 6 గంటల వరకు మాత్రమే సాగునీటిని అందించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News July 11, 2025

వర్ని: పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని తల్లి హత్య..!

image

వర్ని మండలంలో దారుణం జరిగింది. జలాల్పూరులో పెన్షన్ డబ్బుల కోసం కన్నతల్లినే కొడుకు హత్య చేశాడు. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సాయవ్వ(57)ను ఆమె కొడుకు సాయిలు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని గొడవకు దిగాడు. ఈ క్రమంలో తల్లిపై కుర్చి, రాయితో దాడి చేసి పారిపోయాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చుట్టుపక్కల వారు బోధన్ ఆస్పత్రికి తరలించారు. సాయవ్వను పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.

News July 11, 2025

NZB: ముందుందిలే మనకు మంచికాలం..!

image

శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం మెుదలైంది. కొన్నిరోజులుగా కృష్ణానది పరుగులిడుస్తుంటే..గోదారమ్మ వెలవెలబొయింది. కాగా గత మూడు రోజులుగా ఎగువన వర్షాలు కురుస్తుండటంతో శ్రీరామసాగర్‌కు ప్రాజెక్టు వరదనీరు వచ్చిచేరుతోంది. గతేడాది ఇదే సమయానికి 12.440 టీఎంసీల నీరు ఉండగా ఈ ఏడాది 20.138 టీఎంసీల నీరు ఉంది. 4309 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

News July 11, 2025

NZB: తెలంగాణ ఇంజినీర్స్ డే.. మన ప్రాజెక్టులకు రూపశిల్పి ఆయనే

image

మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని జాతీయ ఇంజినీర్స్ డే జరుపుకుంటాం. అలాగే తెలంగాణలో అంతటి మేధావి, సమకాలికుడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ జయంతిని ప్రభుత్వం జూలై11ను ‘తెలంగాణ ఇంజనీర్స్‌డే’ గా నిర్వహిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజాంసాగర్ ప్రాజెక్టు, పొచారం ప్రాజెక్టు, ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారం బోధన్ నిజాంషుగర్స్ ఈయనే నిర్మించారు. కాగా అలీసాగర్ జలాశయానికి ఈయన పేరునే పెట్టారు.