News May 11, 2024
NZB: ఓటేయ్యడానికి ఈ ఇవి తీసుకెళ్లోచ్చు: కలెక్టర్

నిజామాబాద్ ఓటర్కార్డు లేని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద యొక్క గుర్తింపు పత్రాలను తీసుకెళ్లి చూపించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ఓటర్ గుర్తింపు కార్డు, ఆధార్కార్డు, జాబ్కార్డ్, పాసుబుక్, ఇన్సూరెన్స్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్కార్డు, పాస్పోర్ట్, ఫోటో కలిగిన పెన్షన్ డాక్యుమెంట్, సర్వీస్ గుర్తింపుకార్డుల్లో ఏదైనా తీసుకొని వెళ్ళి ఓటు వేయవచ్చని పేర్కొన్నారు.
Similar News
News February 16, 2025
బాల్కొండ: చేపల వేటకు వెళ్లి జాలరి మృతి

బాల్కొండకు చెందిన జాలరి బట్టు నారాయణ(55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. నారాయణ రోజూలాగే ఉదయం 4 గంటలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వద్ద చేపల వేటకు నీటిలో దిగాడు. చేపల కోసం పెట్టిన కండ్రిగలో వలలో చిక్కుకుని నీట మునిగి చనిపోయాడు. స్థానికుల సమాచారంతో మృతదేహాన్ని బయటికి తీసి పోలీసులు పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆర్మూర్కు తరలించారు.
News February 16, 2025
NZB: నిబంధనలు తప్పకుండా పాటించాలి: ఇన్ఛార్జ్ సీపీ

ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా విగ్రహాలను ప్రతిష్ఠించకూడదని నిజామాబాద్ ఇన్ఛార్జి CP సింధుశర్మ ఒక ప్రకటనలో తెలిపారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతులు తప్పనిసరిగా పొందాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, హోటల్స్, ఎగ్జిబిషన్, బిజినెస్ ప్రదేశాల వద్ద ప్రజల కోసం సెక్యూరిటీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజలు పోలీస్ అధికారులకు సహకరించాలన్నారు.
News February 15, 2025
నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.