News January 31, 2025

NZB: కన్న కొడుకును హత్య చేసిన తల్లి.. 10 ఏళ్ల జైలు శిక్ష

image

కన్న కొడుకును హతమార్చిన ఓ తల్లికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ జడ్జి శ్రీనివాస్ గురువారం తీర్పునిచ్చారు. నిజామాబాద్ నాగారం శివార్లలో ఉండే లావణ్య 2023 మార్చి 29న మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఉన్న నిజాంసాగర్ కెనాల్ వద్దకు తన కొడుకును తీసుకెళ్లి హత్య చేసింది. నేరం రుజువు కావడంతో లావణ్యకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారని పోలీసులు తెలిపారు.

Similar News

News February 15, 2025

నిజామాబాద్ జడ్పీటీసీ స్థానాలు ఇవే

image

నిజామాబాద్ జిల్లాలోని 31 జడ్పీటీసీ స్థానాలు, 31 మండలాల పరిధిలో 307 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 8,51,770 మంది ఓటర్లు ఉండగా అధికారులు 1564 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 400 లోపు ఓటర్లు కలిగిన పోలింగ్ కేంద్రాలు 122, 500 లోపు ఓటర్లతో 362, 750 వరకు ఓటర్లు కలిగినవి 1080 ఉన్నాయని అదనపు కలెక్టర్ అంకిత్ తెలిపారు.

News February 14, 2025

కోటగిరి పంచాయతీ కార్యదర్శికి కఠిన కారాగార శిక్ష

image

లంచం తీసుకున్న కేసులో కోటగిరి పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌కు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 40,000 జరిమానా విధిస్తూ ఏసీబీ నాంపల్లి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ ఆఫ్రొజ్ అక్తర్ తీర్పు నిచ్చారు. 2014లో వడ్డే నర్సింహులు తండ్రి పేరు మీద ఉన్న ఇళ్లను అయన, అతని సోదరుడి పేరు మీద బదిలీ చేయడం కోసం కార్యదర్శి రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కోర్టు విచారించి, తీర్పునిచ్చింది.

News February 14, 2025

NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

image

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.

error: Content is protected !!