News April 2, 2025
NZB: కవిత GHIBLI ఇమేజ్ చూశారా..

కాంగ్రెస్ హామీల అమలుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వినూత్నంగా ప్రశ్నించారు. ఆడ పిల్లలకు స్కూటీ ఇవ్వడంపై ఘిబ్లీ ఇమేజ్తో ఇంస్టాగ్రామ్లో ప్రియాంక గాంధీని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ప్రియాంక జీ, స్కూటీ ఎక్కడ ? అంటూ ఇంస్టాగ్రామ్లో స్కూటీ మీనియేచర్ని పట్టుకున్న ఘిబ్లీ ఇమేజ్ను కవిత పోస్ట్ చేశారు.
Similar News
News November 29, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 68,468 క్వింటాళ్ల పత్తి కొనుగోలు

జిల్లాలో ఇప్పటివరకు 68,468 క్వింటాళ్ల పత్తి కొనుగోలు పూర్తయింది. వేములవాడ, కోనరావుపేట మండలాల్లోని 3 కొనుగోలు కేంద్రాల్లో 2889 మంది రైతుల వద్ద 48,958 క్వింటాళ్ల పత్తి, ఇల్లంతకుంట మండలంలోని రెండు కొనుగోలు కేంద్రాల్లో 1242 మంది రైతుల వద్ద 19,510 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు సీసీఐ అధికారులు తెలిపారు. మొత్తం 4132 మంది రైతుల నుండి 68,468 క్వింటాళ్ల కొనుగోలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
News November 29, 2025
జమ్మికుంట మార్కెట్కు రెండు రోజులు సెలవు

జమ్మికుంట మార్కెట్కు శనివారం వారాంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటుందని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా తెలిపారు. శుక్రవారం మార్కెట్కు రైతులు 602 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా గరిష్ఠంగా రూ.7,200, కనిష్ఠంగా రూ.6,200 పలికింది. గోనె సంచుల్లో 11 క్వింటాళ్లు రాగా గరిష్ఠంగా రూ.6,600 పలికింది. తాజాగా పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు రూ.50 తగ్గింది.
News November 29, 2025
SRCL: ‘రేపటి దీక్ష దివాస్ను విజయవంతం చేయండి’

SRCL కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో శనివారం జరిగే దీక్షాదివస్ను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తోట ఆగయ్య మాట్లాడుతూ.. కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో అన్న నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరసన దీక్షను గుర్తిస్తూ ఏటా చేపడుతున్న దీక్షాదివస్ నిర్వహిస్తున్నామన్నారు.


