News February 14, 2025
NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.
Similar News
News December 9, 2025
అల్లూరి జిల్లాలో వలిసి పంట పసిడి పరిమళం

అల్లూరి జిల్లా అరకు ప్రాంతంలో అక్టోబర్ నుంచి జనవరికి విస్తారంగా పండే వలిసి పంట పసుపు పూలతో కనువిందు చేస్తోంది. గిరిజనులు సంప్రదాయంగా వేస్తున్న ఈ పంట ఇప్పుడు పర్యాటకులను, యువతను ఆకర్షిస్తోంది. పసిడి తీరుగా మెరిసే పూల మధ్య ఫోటోలు దిగేందుకు యువత భారీగా వస్తున్నారు. తెలుగు చిత్రపరిశ్రమ సైతం ఈ సీజన్లో అరకును చిత్రీకరణ కేంద్రంగా మలుచుకుంటోంది. గిరిజన గ్రామాలన్నీ వలిసెలు పువ్వులతో కళకళలాడి ఉంటాయి.
News December 9, 2025
భారత్ రైస్పై US టారిఫ్స్.. ఎవరికి నష్టం?

భారత్ రైస్పై US <<18509981>>టారిఫ్స్<<>>(ప్రస్తుతం 40%) పెంచితే మనం కంగారుపడాల్సిన అవసరంలేదని వాణిజ్య నిపుణులు అంటున్నారు. ‘2024-25లో ఇండియా $337.10 మిలియన్ల బాస్మతి రైస్, $54.64 మిలియన్ల నాన్-బాస్మతి రైస్ ఎగుమతి చేసింది. IND బాస్మతిలో ఉండే రిచ్ అరోమా, టెక్స్చర్, టేస్ట్ US రైస్లో ఉండదు. సుంకాల భారం వినియోగదారుల మీదే పడుతుంది. ఇతర దేశాల్లోనూ మన రైస్కు డిమాండ్, మార్కెట్ పెరుగుతోంది’ అని చెబుతున్నారు.
News December 9, 2025
ఉంగుటూరులో ఈనెల 11న మెగా జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ఆధ్వర్యంలో ఈ నెల11న జాబ్ మేళా నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ జాబ్ మేళాకు అర్హులని తెలిపారు.


