News February 14, 2025

NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

image

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.

Similar News

News December 6, 2025

కలెక్టర్ పిలుపు.. ‘3కె రన్ విజయవంతం చేయండి’

image

భీమవరం పట్టణంలో ట్రాఫిక్‌పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు 3కె రన్ శనివారం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ రన్ బీవీ రాజు సర్కిల్ నుంచి ఉదయం 6:30 గంటలకు ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డులోని ఏ.ఎస్.ఆర్ విగ్రహం వరకు కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, వాకర్స్ అసోసియేషన్, అథ్లెటిక్స్, జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొనాలని కోరారు.

News December 6, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 6, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.16 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.33 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.07 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.05 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.41 గంటలకు
♦︎ ఇష: రాత్రి 6.58 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 6, 2025

MKR: పంచాయతీ ఎన్నికల బరిలో ట్రాన్స్‌జెండర్

image

ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ శ్రీప్రేమ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా తమ గ్రామంలోని 9వ వార్డుకు నామినేషన్ దాఖలు చేశారు. గ్రామ అభివృద్ధి, శుభ్రత, పేదల సంక్షేమం, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను ప్రతి అర్హులైన కుటుంబానికి చేరవేయాలని లక్ష్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రేమ తెలిపారు. ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నామినేషన్ గ్రామంలో ప్రత్యేక చర్చగా మారింది.