News November 19, 2024
NZB: కుల గణనపై పాట రచించిన టీచర్.. అభినందించిన మంత్రి

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయంలో కుల గణన పై పాట సిడిని సోమవారం సాయత్రం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. నిజామాబాద్కు చెందిన ఉపాధ్యాయుడు రుద్రాంగి రమేష్ మేరు కుల గణన పై ప్రత్యేకంగా పాట రచించారు. కులగణన సర్వే భవిష్యత్తులో దేశం మొత్తం రోల్ మోడల్గా తీసుకుంటుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మేరు సంగం నాయకులు వెంకటేష్, కీర్తి రాజ్ గోపాల్ పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
NZB: ‘రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది’

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుందని ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్రెడ్డి అన్నారు. NZBలో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథి మాట్లాడారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు అభయ హస్తం హామీలను ఒక్కొక్కటిగా అధికారంలోకి వచ్చిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని పేర్కొన్నారు.
News September 17, 2025
NZB: జాతీయ పతాకాన్ని ఎగరవేసిన CM సలహాదారు

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బుధవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) వేం నరేందర్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జిల్లా ప్రగతిని వివరించారు. కలెక్టర్ వినయ్ కృష్ణా రెడ్డి, CP సాయి చైతన్య, MLAలు భూపతి రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
News September 16, 2025
టీయూ ఎం.ఎడ్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో సెప్టెంబర్/అక్టోబర్-2025లో నిర్వహించనున్న ఎం.ఎడ్ 2వ సెమిస్టర్ రెగ్యులర్ థియరీ పరీక్షలకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు సెప్టెంబర్ 20లోపు ఫీజులు చెల్లించవచ్చని, రూ.100 ఆలస్య రుసుముతో సెప్టెంబర్ 22 వరకు గడువు ఉంటుందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు www.telanganauniversity.ac.inను సందర్శించాలని సూచించారు.