News September 26, 2024

NZB: కూతురిని చంపాడన్న అనుమానంతో హత్య..!

image

తన కూతురిని హత్య చేశాడన్న అనుమానంతో మామను.. వియ్యంకుడు హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కంజర్‌లో జరిగింది. కంజర్‌కు చెందిన సత్యనారాయణ తన కూతురిని అదే గ్రామానికి చెందిన నరహరి కుమారుడికి ఇచ్చి వివాహం చేశాడు. ఇటీవల సత్యనారాయణ కూతురు అనుమానాస్పదస్థితిలో మృతి చెందగా తన కూతురుని నరహరే హత్య చేశాడని కోపం పెంచుకున్న సత్యనారాయణ రాత్రి నరహరిని కట్టెలతో కొట్టి హతమార్చాడు.

Similar News

News October 27, 2025

NZB: నేడు ‘లక్కీ’గా వైన్స్‌లు దక్కేదెవరికి?

image

మద్యం షాపుల టెండర్లకు నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. జిల్లాలోని 102 లిక్కర్ షాపులకు 2,786 దరఖాస్తులు వచ్చాయి. దీనితో జిల్లా ఎక్సైజ్ శాఖకు ఒక్కో టెండర్‌కు రూ.3 లక్షల చొప్పున రూ83.58కోట్ల ఆదాయం లభించింది. లక్కీ డ్రాలో అదృష్టం ఎవరిని వరించనుందో చూడాలి. అయితే గత టెండర్లలో 3,759 దరఖాస్తులు రాగా.. ఈసారి టెండర్లను రూ.3 లక్షలకు పెంచడంతో దరఖాస్తులు తగ్గాయి.

News October 26, 2025

కాంగ్రెస్ మునిగిపోయే నావ: కవిత

image

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని, వారితో తనకు పని లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ… అనుకోకుండా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని కాపాడుకోలేకపోతోందని విమర్శించారు. ఆ పార్టీకి ప్రజల నుంచే దిక్కు లేదని, తనకు మద్దతు తెలుపుతున్నారన్న దాంట్లో వాస్తవం లేదని ఆమె ఎద్దేవా చేశారు.

News October 26, 2025

నిజామాబాద్: బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి: కవిత

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ రాజీనామాతో శ్రీకారం చుట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె నిజామాబాద్‌ నగర శివారులోని ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ఎంపీ అర్వింద్‌తో పాటు తెలంగాణలోని బీజేపీకి చెందిన 8 మంది రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు నడుచుకుంటూ వస్తుందన్నారు. తక్షణమే వారు రాజీనామా చేయాలన్నారు.