News April 7, 2025
NZB: ఖిల్లా రామాలయంలో ట్రాన్స్ జెండర్ల వివాహం

శ్రీరామ నవమిని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా రామాలయంలో ఆదివారం నిజామాబాద్కు చెందిన ఓ ట్రాన్స్ జెండర్ జంట వివాహం చేసుకున్నారు. ప్రతి ఏటా భద్రాచలం, వేములవాడ తదితర పుణ్యక్షేత్రాల్లో ఇలాంటి వివాహాలు ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ ఏడాది తొలిసారిగా జిల్లా కేంద్రంలోని రామాలయంలో ట్రాన్స్ జెండర్లు వివాహం చేసుకున్నారు.
Similar News
News October 28, 2025
HYD: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై మధురానగర్ PSలో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. 26న లక్ష్మీ నరసింహనగర్లో ఉన్న కాంగ్రెస్ ప్రచార వాహనం డ్రైవర్ను హెచ్చరిస్తూ, సైగలు చేస్తూ వెళ్లాడు. ఈ ఘటనను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ వీడియో తీసి పోలీసులకు అందించగా కేసు నమోదు చేశారు.
News October 28, 2025
ఈ మందు ‘యమ’ డేంజర్

TG: రాష్ట్రంలో ఆత్మహత్యలకు వినియోగిస్తున్న పారాక్వాట్ గడ్డిమందును బ్యాన్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొన్నిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేసే ఈ మందును రైతులు వాడతారు. అయితే ఆత్మహత్యలకూ వినియోగించడం ఆందోళన కలిగిస్తోంది. ఇది తాగిన వెంటనే కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. విరుగుడు లేకపోవడంతో 98% కేసుల్లో మరణాలు సంభవిస్తున్నాయి. మన దేశం కేరళ, ఒడిశాతో పాటు 32దేశాల్లో నిషేధం ఉంది.
News October 28, 2025
ఆలేరులో అధిక వడ్డీ, బిట్ కాయిన్ల దందా

ఆలేరులో అధిక వడ్డీ వ్యాపారం జోరుగా నడుస్తోంది. కొందరు వడ్డీ వ్యాపారులు బాధితుల నుంచి ముందుగానే తెల్ల కాగితంపై సంతకాలు చేయించుకుని ఈ దందా నడిపిస్తున్నట్లు సమాచారం. అలాగే బిట్ కాయిన్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గంలోనూ బినాన్స్ వ్యవహారంపై గతంలో వార్తలొచ్చాయి. అధిక డబ్బుకు ఆశపడి జీవితాలు ఆగం చేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.


