News September 14, 2024
NZB: గణేశ్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్

గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్లు మూసేయాలని ఆదేశించారు.
Similar News
News November 15, 2025
NZB: గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

ఎండు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ వెంకటేష్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని భావం సాహెబ్ పాడ్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు. అమీర్ ఖాన్ అనే వ్యక్తి బైక్పై 260 గ్రాముల ఎండు గంజాయిని తరలిస్తూ పట్టుబడినట్లు పేర్కొన్నారు.
News November 14, 2025
ఆర్మూర్: విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయండి: DIEO

ఇంటర్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇంటర్ బోర్డు కమిషనర్ సూచించిన మేరకు ప్రతి అధ్యాపకుడు ఉద్యోగి విద్యార్థుల శ్రేయస్సు కోసం పని చేయాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆర్మూర్లోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల, గిరిజన బాలుర జూనియర్ కళాశాల, సాంఘిక సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. ఇంటర్ బోర్డు నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు.
News November 14, 2025
NZB: ఇది ప్రజా విజయం: మహేష్ కుమార్ గౌడ్

జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ప్రజా విజయమని TPCC అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం అయినా నిజామాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసముంచి తమ అభ్యర్థిని గెలిపించారని అన్నారు. ఇది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సంకేతమని అభివర్ణించారు.


