News August 22, 2024

NZB: గల్లంతైన చిన్నారి అనన్య మృతదేహం లభ్యం

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆనంద్‌నగర్ లో నిన్న సాయంత్రం వరద నీటిలో <<13910342>>గల్లంతైన చిన్నారి <<>>అనన్య మృతదేహం లభ్యమయింది. రాత్రి వరకు మున్సిపల్ సిబ్బంది, ఫైర్ సిబ్బంది గాలించినప్పటికీ చీకటి కారణంగా ఆచూకీ దొరకలేదు. అయితే డివిజన్ మున్సిపల్ కార్పొరేషన్ సానిటరీ ఇన్‌స్పెక్టర్ మహిపాల్ ఆధ్వర్యంలో సుమారు 50 మంది మున్సిపల్ కార్మికులతో గాలింపు చర్యలు చేపట్టగా పీఎఫ్ ఆఫీస్ వెనుక ప్రాంతంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

Similar News

News December 12, 2025

నిజామాబాద్: మైకులు ఆగాయి, మందు షాపులు మూతపడ్డాయి!

image

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడత ఎన్నిక గురువారంతో ముగిసింది. రెండో విడతలో భాగంగా ఎనిమిది మండలాలకు సంబంధించిన ఎన్నిక ఈ నెల 14న జరగనుంది. ధర్పల్లి, డిచ్పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, ముగ్పాల్, నిజామాబాద్ రూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలంలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే పక్షం రోజులుగా గ్రామాల్లో సందడి అంతా ఇంతా కాదు. ఎటు చూసినా మైకులు, నేతల ఉరుకుల పరుగులు, ఏ విధి చూసినా ప్రచారహోరే వినిపించింది.

News December 12, 2025

NZB: మొక్కజొన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

image

మొక్కజొన్న విక్రయాలు జరిపిన రైతుల బ్యాంకు ఖాతాలలో ప్రభుత్వం తొలి విడత డబ్బులు జమ చేసిందని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని రైతులకు తొలి విడతగా రూ. 10.00 కోట్ల నిధులు విడుదలయ్యాయన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా జిల్లాలో 33 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, 2,63,016 క్వింటాళ్ల మొక్కజొన్నను సేకరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. క్వింటాలుకు రూ. 2400 మద్దతు ధర చెల్లిస్తున్నామన్నారు.

News December 12, 2025

NZB: 132 స్థానాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయం

image

నిజామాబాద్ జిల్లాలో తొలి దశలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలుపొందారు. 184 GPల్లో 29 ఏకగ్రీవం కాగా 155 GPలకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులు 132, బీజేపీ మద్దతుదారులు 15, BRS మద్దతుదారులు 15, జాగృతి మద్దతుదారులు నలుగురు, ఇతరులు 18 చోట్ల గెలుపొందారు.