News July 13, 2024
NZB: గూడ్స్ రైలు కింద పడి హోంగార్డ్ ఆత్మహత్య

నిజామాబాద్ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధికి చెందిన ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎల్లమ్మ గుట్టకు చెందిన గుమ్మడి దార్ల సంపత్ కుమార్ (నంబర్ 413) శనివారం తెల్లవారుజామున గూడ్స్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు.
Similar News
News February 18, 2025
NZB: స్టేట్ లెవెల్ స్కేటింగ్లో జిల్లా క్రీడాకారులకు మెడల్స్

స్టేట్ లెవెల్ స్కేటింగ్లో జిల్లా స్వెటర్లు మెడల్స్ సాధించారు. హైదరాబాదులో నిర్వహించిన 13వ ఎస్ ప్రో ట్విన్ సిటీస్ రోలర్ స్కేటింగ్ రాష్ట్రస్థాయి స్కేటింగ్ లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ ప్రదర్శించారు. ఇందులో నిజామాబాద్ జిల్లా నుంచి వివిధ కేటగిరీలలో సుమారు 60 మంది క్రీడాకారులు పాల్గొనగా 8 గోల్డ్ మెడల్స్, 12 సిల్వర్ మెడల్స్, 10 బ్రాంజ్ మెడల్స్ సాధించారు.
News February 17, 2025
KMR: అన్న బెదిరింపు.. హత్య చేసిన తమ్ముళ్లు

మేడ్చల్లో సంచలనం రేపిన <<15484237>>హత్య<<>> కేసు వివరాలు పోలీసులు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డికి చెందిన ఉమేశ్(25), రాకేశ్, లక్ష్మణ్ అన్నదమ్ములు. మద్యానికి బానిసైన ఉమేశ్ వేధింపులు తాళలేక అతడిని దుబాయ్ పంపుదామని ఇంట్లో ప్లాన్ చేశారు. ఇష్టంలేని అతడు ఆ ప్లాన్ చెడగొట్టాడు. ఆదివారం ఇంట్లో ఉన్న తమ్ముళ్లను బెదిరించడంతో వాళ్లు ఎదురుతిరిగారు. ఉమేశ్ పారిపోతుండగా నడిరోడ్డుపై అతడిని దారుణంగా చంపేశారు.
News February 17, 2025
ముప్కాల్లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామ శివారులోని చెరువులో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పోలీసుల వివరాల ప్రకారం.. మృతుడి వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. తెలుపు & బూడిద రంగు డబ్బాల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించి ఉన్నాడు. ఎత్తు 5.6 అంగులాలు ఉన్నట్లు వెల్లడించారు. వివరాలు తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని సూచించారు.