News December 14, 2024

NZB: గ్రూప్-2 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 15,16వ తేదీల్లో జరుగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు NZB కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం తెలిపారు. రెండు రోజుల పాటు ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయన్నారు. ఇందు కోసం 63 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News January 24, 2025

ఆర్మూర్: ఆదిలాబాద్ నుంచి గంజాయి తెచ్చి విక్రయాలు

image

అదిలాబాద్ జిల్లా ఇచ్చోడ నుంచి గంజాయిని కొనుగోలు చేసి ఆర్మూర్ చుట్టుపక్కల చిన్న చిన్న ప్యాకెట్లలో విక్రయిస్తున్న ఇద్దరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ సిఐ K. స్టీవెన్సన్ తెలిపారు. తొర్లికొండకు చెందిన నూనె కిరణ్, అంకాపూర్ లో ఉంటున్న నూనె శ్రీకాంత్ లు అక్రమంగా గంజాయిని విక్రయాల కోసం బైక్ పై రవాణా చేస్తూ అంకాపూర్ వద్ద పట్టుబడ్డారని CIవివరించారు.

News January 24, 2025

NZB: గంజాయితో ఒకరిని అరెస్ట్

image

నిజామాబాద్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ పోలీసులు గురువారం ఒకరిని గంజాయితో అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి.స్వప్న తెలిపారు. నగరంలో తనిఖీలు నిర్వహిస్తుండగా జునైద్ అనే ఓ యువకుడు 0.7 కిలోల గంజాయితో పట్టుబడ్డాడన్నారు. ఈ మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు స్వప్న వివరించారు. ఈ తనిఖీల్లో ఎస్సై బి.రాం కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు రాజన్న, భూమన్న, కానిస్టేబుళ్లు భోజన్న, సుకన్య పాల్గొన్నారన్నారు.

News January 24, 2025

NZB: పీయూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ అర్వింద్

image

కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. పసుపు ఎగుమతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై వారు చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ త్వరగా పసుపు బోర్డు కార్యక్రమాలను మొదలుపెడతామని స్పష్టం చేశారు.