News February 26, 2025
NZB: చికిత్స పొందుతూ మహిళ మృతి

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఈ నెల 23న ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండటంతో 108 ద్వారా చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ.. బుధవారం మహిళ మృతి చెందింది. మృతురాలిని ఎవరైనా గుర్తుపడితే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని రఘుపతి సూచించారు.
Similar News
News November 30, 2025
NZB: మొదటి విడతకు 4,700 నామినేషన్లు

నిజామాబాద్ జిల్లాలో మొదటి విడతలో జరగనున్న GP ఎన్నికల్లో 3 రోజుల్లో మొత్తం 4,700 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. 184 సర్పంచి స్థానాలకు 1,167 నామినేషన్లు, 1,642 వార్డు మెంబర్ల స్థానాలకు 3,533 నామినేషన్లు వచ్చినట్లు చెప్పారు. శనివారం చివరి రోజు సర్పంచి స్థానాలకు 863 నామినేషన్లు, వార్డు మెంబర్ల స్థానాలకు 3,151 నామినేషన్లు దాఖలు అయ్యాయన్నారు.
News November 29, 2025
ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి రద్దు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.
News November 29, 2025
ఎన్నికల కోడ్ కారణంగా ప్రజావాణి రద్దు: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు.


