News September 3, 2024
NZB: చెరువు కబ్జా కేసు.. కార్పోరేటర్ భర్తతో పాటు ఐదుగురి అరెస్ట్

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బొందెం చెరువు ఆక్రమణల కేసులో 10వ డివిజన్ కార్పొరేటర్ కోమలి భర్త నరేశ్తో పాటు కోటగల్లి జావిద్, మహిళా లీడర్ కమలమ్మ, BRS నాయకుడి ప్రధాన అనుచరుడైన మక్కల గోపాల్, మస్తాన్ ను మంగళవారం 5వ టౌన్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. బీఆర్ఎస్ నాయకులు, దళారులు, నకిలీ పట్టాలు తయారు చేసేవారు కుమ్మక్కై తమకు చెరువు శిఖం భూమిలో ప్లాట్లు విక్రయించారని బాధితులు ఆరోపించారు.
Similar News
News October 21, 2025
NZB: కొనుగోలు కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వేగవంతంగా జరిగేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. బోధన్ మండలంలోని పెగడాపల్లి, సాలూర మండలం సాలెంపాడ్ క్యాంపుల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండి కొనుగోళ్లను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
News October 21, 2025
18 మంది అసువులు బాశారు: NZB CP

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుంచి ఇప్పటి వరకు 18 మంది పోలీసులు అసాంఘిక శక్తులతో పోరాడుతూ అసువులు బాశారని CP సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 191 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా తమ కర్తవ్య నిర్వహణలో ఎల్లవేళలా పోలీసులు ముందంజలో నిలుస్తున్నారని పేర్కొన్నారు.
News October 20, 2025
NZB: రియాజ్ మృతిపై ప్రమోద్ కుటుంబం హర్షం

నిజామాబాద్ జిల్లాలోని కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి పట్ల ఆయన భార్య ప్రణీత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు.