News April 13, 2025

NZB: చేపలు పట్టేందుకు వెళ్లి బావ, బావమరిది మృతి

image

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ శుక్రవారం సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 27, 2025

ASF: నేడు మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

image

ASF జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపుకు 680 మంది వ్యాపారులు దరఖాస్తులు సమర్పించారు. ఈ దరఖాస్తులపై లక్కీ డ్రా కార్యక్రమం నేడు జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ASF, కెరమెరి-గోయాగాం, WKD, తిర్యాని, గూడెం మండలాల్లో ఉన్న దుకాణాలకు తమ పేర్లు లక్కీ డ్రాలో ఎంపికైతే అదృష్టం తలుపు తట్టినట్లే అంటూ వ్యాపారులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

News October 27, 2025

అక్టోబర్ 27: చరిత్రలో ఈరోజు

image

1904: స్వాతంత్ర్య సమరయోధుడు జతీంద్ర నాథ్ దాస్ జననం
1914: కవి, పండితుడు బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు మరణం
1940: గిరిజనోద్యమ నాయకుడు కొమురం భీమ్ మరణం
1961: నాసా శాటర్న్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించింది
1984: మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ జననం
1986: సినీ గేయ రచయిత కొసరాజు రాఘవయ్య మరణం

News October 27, 2025

ALERT.. నల్గొండ జిల్లాపై ‘మొంథా’ ప్రభావం

image

రానున్న 2,3 రోజులు ‘మొంథా’ తుఫాన్ ప్రభావం నల్గొండ జిల్లాలో తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఆదివారం ఆమె ఈ విషయమై సంబంధిత జిల్లా అధికారులు, ఆర్డీవోలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయంపై ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులు ఆదేశించారు. రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తడిసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావద్దన్నారు.