News April 13, 2025

NZB: చేపలు పట్టేందుకు వెళ్లి బావ, బావమరిది మృతి

image

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ శుక్రవారం సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 16, 2025

పెళ్లి చేసుకున్న స్టార్ నటి

image

SVSC, దమ్ము, ఢమరుకం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అభినయ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన చిన్ననాటి స్నేహితుడు కార్తీక్‌తో ఏడడుగులు వేశారు. పదిహేనేళ్ల నుంచి అభినయ, కార్తీక్ ప్రేమించుకుంటున్నారు. ఈక్రమంలోనే ఇవాళ పెళ్లితో ఒక్కటయ్యారు. కాగా పుట్టుకతోనే చెవిటి, మూగ అయిన అభినయ తన అద్భుతమైన నటనతో లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్నారు.

News April 16, 2025

IPL: ఒకే ఓవర్‌లో 11 బంతులేశాడు

image

ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ ఆఖరి ఓవర్లో చెత్త ప్రదర్శన చేశారు. ఏకంగా 11 బంతులు వేయగా ఇందులో నాలుగు వైడ్లు, ఒక నోబాల్ ఉన్నాయి. సిక్సు, ఫోర్, నాలుగు సింగిల్స్ కలుపుకొని 19 పరుగులు సమర్పించుకున్నారు. దీంతో IPLలో ఒకే ఓవర్లో 11 బంతులు వేసిన నాలుగో బౌలర్‌గా నిలిచారు. అంతకుముందు తుషార్ దేశ్ పాండే, సిరాజ్, శార్దూల్ కూడా ఓవర్లో 11 బంతులు వేసి చెత్త రికార్డు మూటగట్టుకున్నారు.

News April 16, 2025

కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

image

➤ మాదక ద్రవ్య మోసాలపై QR కోడ్: కర్నూలు SP
➤ ఎమ్మిగనూరులో YCP నుంచి TDPలోకి చేరికలు
➤ కర్నూలు TDP కార్యాలయంపై దాడి.. నలుగురి అరెస్టు
➤ఎమ్మిగనూరు విద్యార్థినికి లోకేశ్ సన్మానం
➤ కోడుమూరు: ముగ్గురు వీఆర్వోలపై బదిలీవేటు

NOTE:- పైన టూల్ బార్లో లొకేషన్ మీద, తర్వాత ‘వి’ సింబల్‌ని క్లిక్ చేసి మన గ్రామ/మండల/నియోజకవర్గ/జిల్లా ఎడిషన్ వార్తలను కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోండి.

error: Content is protected !!