News April 13, 2025

NZB: చేపలు పట్టేందుకు వెళ్లి బావ, బావమరిది మృతి

image

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ శుక్రవారం సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News April 13, 2026

సంగారెడ్డి: బీటెక్ విద్యార్థి మృతి.. ఐదుగురికి పునర్జన్మ

image

తాను మరణిస్తూ ఐదుగురికి ప్రాణదానం చేశారు సంగారెడ్డి మం. కోత్లాపూర్‌కు చెందిన ఉదయ్ కిరణ్ (21). బీటెక్ పూర్తి చేసిన ఉదయ్ ఈనెల 4న బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కింద పడి తలకు తీవ్ర గాయమైంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ కావడంతో, ఆ పుట్టెడు దుఃఖంలోనూ తండ్రి శ్రీనివాస్, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో ఉదయ్ అవయవాలు సేకరించి ఐదుగురు బాధితులకు అమర్చి పునర్జన్మ ప్రసాదించారు.

News April 13, 2026

‘వనజీవి’ రామయ్యకు దక్కని గౌరవం

image

కోటికి పైగా మొక్కలు నాటి పద్మశ్రీ అందుకున్న ‘వనజీవి’ రామయ్య ప్రథమ వర్ధంతిని పాలకులు, అధికారులు విస్మరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన బతికున్నప్పుడు ఫొటోల కోసం పోటీపడిన నేతలు, నేడు నివాళులర్పించేందుకు రాకపోవడంపై అభిమానులు ఆవేదన చెందుతున్నారు. పర్యావరణం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడిని ఏడాదిలోనే మరచిపోవడం విచారకరమని ప్రజలు వాపోతున్నారు.

News April 13, 2026

విశాఖ: టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై మీ కామెంట్..!

image

GVMC పరిధిలో టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ప్రతి సోమవారం PGRSలో అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. 2 నెలల క్రితం టౌన్ ప్లానింగ్ అధికారులు, నాయకులు వేధింపులు తాళలేక కంచరపాలెంలో ఒక వ్యక్తి ఉరి వేసుకునేందుకు ప్రయత్నించాడు. ఇటీవల టౌన్ ప్లానింగ్‌ శాఖపై ACB దాడులు కలకలం సృష్టించాయి. గత కలెక్టర్ కూడా ఈ శాఖ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ విశాఖ ప్రజలు టౌన్ ప్లానింగ్‌ సిబ్బందిపై మీ కామెంట్ తెలపండి.