News January 26, 2025

NZB: జాతీయ క్రీడలకు డీసీడీఎంగా జిల్లా వాసి

image

ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉత్తరాఖాండ్‌లో జరగనున్న నేషనల్ గేమ్స్‌కు జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఈగ సంజీవ్ రెడ్డి డిప్యూటీ చీఫ్ డి మిషన్‌గా నియమితులయ్యారు. తెలంగాణ నుంచి ఇద్దరిని డిప్యూటీ చీఫ్ డి మిషన్‌గా నియమించగా జిల్లాకు చెందిన ఈగ సంజీవ్ రెడ్డి నియమితులవడం విశేషం. సంజీవరెడ్డి నియామకంపై జిల్లా క్రీడాసంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

Similar News

News February 10, 2025

బాల్కొండ: కాలువలో వ్యక్తి గల్లంతు.. వివరాలు ఇవే!

image

బాల్కొండ మండలం బుస్సాపూర్‌లోని ఇందిరమ్మ కాలువలో పడి <<152100>>వ్యక్తి<<>> గల్లంతయిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెందిన బీర్ సింగ్ మారాబి(40) బస్సాపూర్‌లో తాపీ మేస్త్రీగా పని చేస్తున్నాడు. కాగా ఆదివారం తన ఫోన్ రిపేర్ చేసుకొని తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడ్డాడు. విషయం తెలుసుకున్న అధికారులు ఆదివారం నీటిని నిలిపివేశారు.

News February 10, 2025

బాల్కొండ: వరద కాలువలో వ్యక్తి గల్లంతు

image

బాల్కొండ మండలం బుస్సాపూర్ వద్ద ఇందిరమ్మ వరద కాలువలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వ్యక్తి ప్రమాదవశాత్తు వరద కాలువలో పడి పోవడంతో నీటి విడుదలను ప్రాజెక్టు అధికారులు నిలిపి వేశారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం వరకు 2,500 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగింది.

News February 10, 2025

ఆర్మూర్ రానున్న త్రిపుర గవర్నర్

image

త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆర్మూర్ పట్టణానికి రానున్నట్లు BJP సీనియర్ నాయకుడు లోక భూపతిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బాసరలో మహా జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకోనున్నారు. మామిడిపల్లిలోని వెంకటేశ్వర స్వామి వారిని, సిద్ధుల గుట్ట సిద్ధేశ్వరుడిని దర్శించుకొనున్నారు. BJP సీనియర్ నాయకులు భూపతి రెడ్డి స్వగృహానికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లిన అనంతరం బాసరకు బయలుదేరుతారు.

error: Content is protected !!