News January 29, 2025
NZB: జానకం పేట గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్య

నిజామాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నర్సయ్య(60) హత్యకు గురయ్యాడు. రక్తపు మడుగులో పడి మృతి చెందడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 22, 2025
ప్రజల్లోకి KCR.. దళపతి ముందు 2 సవాళ్లు

AP నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి. మొదటిది కూతురు కవిత.. తనపై తప్ప KTR సహా BRS ముఖ్య నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమెపై, ప్రత్యర్థుల ప్రశ్నలపై ఏమంటారు? అటు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదని CM రేవంత్ విమర్శిస్తున్నారు. బయటకు వస్తున్న మాజీ సీఎం సభలోకీ వస్తారా? అనేది ఛాలెంజ్2.
News December 22, 2025
ఇళ్ల నిర్మాణాల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లాలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం సమీక్షించారు. ఆప్షన్-3, PMAY 1.0 ఇళ్ల నిర్మాణాల్లో అజయ్ వెంచర్స్, పల్లా ఏసుబాబు, జి.వెంకటేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి సత్వరమే లబ్ధిదారులకు అప్పగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని గుత్తేదారులను హెచ్చరించారు. గడువులోగా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News December 22, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


