News April 25, 2024

NZB జిల్లాలో BRSకు షాక్.. BJP లోకి కోటపాటి

image

లోక్ సభ ఎన్నికల వేళ NZB జిల్లాలో BRS పార్టీకి షాక్ తగిలింది. రైతు, గల్ఫ్ సంక్షేమ సంఘం నేత కోటపాటి నరసింహనాయుడు BRS పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరుతున్నట్లు ప్రకటించారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్న కోటపాటి పసుపు బోర్డు కోసం రైతుల పక్షాన పోరాటాలు చేశారు. బీజేపీ ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డుపై ప్రకటన చేసినందున బీజేపీలో చేరుతున్నట్లు తెలిపారు.

Similar News

News March 9, 2026

NZB: మినీ సరస్ మేళాను సందర్శించిన డీఎంహెచ్‌ఓ

image

నిజామాబాద్‌లో నిర్వహిస్తున్న ‘మినీ సరస్ మేళా-2026’ను జిల్లా ఆరోగ్య శాఖ అధికారి (DMHO) డా.బి.రాజశ్రీ సందర్శించారు. గ్రామీణ చేతివృత్తి కళాకారులు, స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆమె ఆసక్తిగా తిలకించారు. హస్తకళ నైపుణ్యంతో తయారైన వస్తువులను పరిశీలించారు. ఈ ప్రదర్శన ఎంతో ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా గ్రామీణ సంస్కృతిపై అవగాహన కల్పించేలా ఉందని ఆమె కొనియాడారు.

News March 8, 2026

NZB: పెరిగిన గ్యాస్ ధరలు.. జిల్లా ప్రజలపై రూ.కోటి భారం

image

పెరిగిన వంట గ్యాస్ సిలెండర్ల రేటుతో నిజామాబాద్ జిల్లా ప్రజలపై రూ.కోటి వరకు భారం పడనుంది. జిల్లాలో 5,81,769 గ్యాస్ కనెక్షన్లు ఉండగా 42 గ్యాస్ ఏజెన్సీల ద్వారా సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రతినెలా సగటున 1.50 లక్షల వరకు సిలిండర్ల వినియోగం అవుతున్నట్లు గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు తెలిపారు. ఈ క్రమంలో గృహ వినియోగ సిలెండర్‌పై రూ.60 పెరగడంతో పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆర్థిక భారం కానుంది.

News March 8, 2026

నిజామాబాద్ జిల్లాలో ‘అతివలదే’ అధికారం

image

NZB జిల్లా ప్రగతి పథానికి మహిళా అధికారులు కీలక పాత్ర పోషిస్తున్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ప్రధాన జడ్జీగా భరత లక్ష్మీ, DMHOగా డా.రాజశ్రీ, జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారిగా రసూల్ బీ, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిగా పద్మశ్రీ, RTC RMగా జ్యోత్స్న జిల్లా పాలనలో తమదైన ముద్ర వేస్తున్నారు. వీరే కాకుండా పలు శాఖల్లో అధికారులుగా మహిళలు రాణిస్తున్నారు.
# అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు