News December 10, 2024
NZB జిల్లా ఆసుపత్రి పైనుంచి దూకి వ్యక్తి సూసైడ్

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. నాగరం ప్రాంతానికి చెందిన చాట్ల లక్ష్మణ్ (50) అనారోగ్య సమస్యతో 4 రోజుల క్రితం ఆస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం ఆసుపత్రి భవనం పైఅంతస్తు నుంచి దూకడంతో తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు 1 టౌన్ SHO రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 12, 2026
NZB: శాంతిభద్రతల కోసం పోలీసులకు సహకరించాలి: డీసీపీ

మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ప్రజలు, రాజకీయ నాయకులు శాంతిభద్రతల కోసం పోలీసులకు సహకరించాలని NZB అడిషనల్ DCP బస్వారెడ్డి కోరారు. గురువారం పోలీస్ అధికారులకు, సిబ్బందికి సమావేశం నిర్వహించారు. డీసీపీ బస్వారెడ్డి వారికి విధుల పట్ల దిశా నిర్దేశం చేశారు. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎవరూ ర్యాలీలు, సమావేశాలు విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని సూచించారు.
News February 12, 2026
NZB: ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు: కలెక్టర్

స్ట్రాంగ్ రూమ్ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ ఉదయం 8 గంటల నుంచి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుందని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. నిర్ణీత సమయానికి కౌంటింగ్ ప్రారంభించేందుకు వీలుగా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేశామన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని కలెక్టర్ తెలిపారు.
News February 12, 2026
ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి: NZB కలెక్టర్

నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలలో రిటర్నింగ్ అధికారులకు, కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్లకు శుక్రవారం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతులను కలెక్టర్ సందర్శించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించాల్సిన విధానం గురించి వివరించారు.


