News March 15, 2025

NZB: జేఎల్‌గా ధరణీ శంకర్

image

రవీంద్ర భారతిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జూనియర్ లెక్చరర్ల నియామక పత్రాలను అందజేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా వాజిద్ నగర్ గ్రామానికి చెందిన ధరణి శంకర్ బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా నియామకం పొందాడు. ఈ సందర్భంగా ఆయనను గ్రామస్థులు, ప్రిన్సిపల్ అభినందించారు.

Similar News

News March 15, 2025

NZB: గంజాయి అమ్ముతున్న యువకుడి అరెస్ట్

image

నిజామాబాద్ నగరంలోని NGOs కాలనీలో గంజాయి అమ్ముతున్న కోడె సంపంత్ (24)ను నిన్న రాత్రి త్రీ టౌన్ ఎస్సై హరిబాబు అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. గంజాయిని నాందేడ్ నుంచి తీసుకొని ఇక్కడ అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ దాడి చేసి నిందితుడిని పట్టుకుని అతడి నుంచి 230 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ వివరించారు. 

News March 15, 2025

NZB: రైల్వే స్టేషన్‌లో చిన్నారి MISSING

image

నిజామాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఓ చిన్నారి అదృశ్యమైనట్లు 1 టౌన్ SHO రఘుపతి శనివారం తెలిపారు. శుక్రవారం కుటుంబ సభ్యులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన చిన్నారి స్టేషన్‌లో కనపడకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతంలో వెతికిన చిన్నారి జాడ దొరకలేదు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎవరైనా గుర్తుపడితే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు.

News March 15, 2025

NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

image

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.

error: Content is protected !!