News April 24, 2024
NZB: టెట్కు తగ్గిన ఆదరణ
టెట్కు దరఖాస్తులు తగ్గాయి. ఈసారి ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు అనాసక్తి చూపుతున్నారు. గతేడాది నిర్వహించిన పరీక్షలో చాలా తక్కువ మంది ఉత్తీర్ణత సాధించడంతో టెట్ అప్లయ్ చేసుకునేందుకు విముఖత చూపుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో పేపర్-1 4327, పేపర్-2 9045 మంది అప్లయ్ చేసుకున్నారు. కామారెడ్డిలో పేపర్-1కు 3773, పేపర్-2కు 4440 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Similar News
News January 26, 2025
NZB: నాలుగు పథకాల ప్రారంభించే గ్రామాలు ఇవే
NZB జిల్లాలోని 31 గ్రామాల్లో ఆదివారం నాలుగు పథకాలు ప్రారంభం కానున్నాయి. పలు గ్రామాలను అధికారులు ప్రకటించారు. మిర్దపల్లి, కోమన్ పల్లి, జలాల్పూర్, లింగాపూర్, లంగ్డపూర్, గన్పూర్, సీతయ్ పేట్, కమలాపూర్, గంగసముందర్, అన్సన్ పల్లి, నారాయణపేట, ముల్లంగి బి, కొడిచెర్ల, తిమ్మాపూర్, నర్సింపల్లి మల్కాపూర్, డొంకల్, వేంపల్లి, చిన్న వాల్ గోట్, జైతాపూర్ తో పాటు మిగతా గ్రామాల్లో పథకాలను అధికారులు ప్రారంభించనున్నారు.
News January 26, 2025
NZB: బాలికల కళాశాల విద్యార్థినికి మొదటి బహుమతి
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.
News January 26, 2025
NZB: తొర్లికొండ ZPHS విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
తొర్లికొండ ZPHS విద్యార్థి శ్రావ్య జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైంది. ఇటీవల మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో జరిగిన రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-19లో జిల్లా జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఈ నెల 24 నుంచి 28 వరకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం శంభాజీ నగర్ (మహారాష్ట్ర)లో జరిగే 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-19 పోటీల్లో పాల్గొననున్నట్లు ఫిజికల్ డైరెక్టర్ గంగా మోహన్ తెలిపారు.