News August 9, 2024
NZB: డైరెక్ట్ బిజినెస్ పేరిట వాట్సాప్ గ్రూపులో కొత్త తరహా మోసం
నిజామాబాద్ జిల్లాలో డైరెక్ట్ బిజినెస్ పేరిట వాట్సాప్ గ్రూపులో కొత్త తరహా మోసం ప్రారంభించారని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ‘ఆల్ టైప్ ఆఫ్ క్లాత్స్ క్యాష్ ఆన్ డెలివరీ’ పేరిట వాట్సాప్ గ్రూపు నడుపుతూ డైరెక్ట్గా కంపెనీల నుంచి వస్తువులు తక్కువ ధరకే మీ ఇంటికే వస్తాయని నమ్మిస్తున్నారు. బ్రాండ్ల పేరిట ఆర్డర్లు తీసుకుని నాసిరకం బట్టలు పంపుతున్నారని ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తోందని చెబుతున్నారు.
Similar News
News February 6, 2025
NZB: ఉపాధ్యాయులకు డీఈవో నోటీసులు
సమయానికి పాఠశాలకు హాజరు కాని నలుగురు ఉపాధ్యాయులకు డీఈవో అశోక్ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. గురువారం నిజామాబాద్ వినాయకనగర్ ప్రాథమికోన్నత పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఆ సమయంలో టీచర్లు రాకపోవడంతో నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించడంతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.
News February 6, 2025
NZB: జూనియర్ కళాశాలను DIEO తనిఖీ
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ గర్ల్స్ జూనియర్ కళాశాలను జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి (DIEO) రవి కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కళాశాలలో నిర్వహిస్తున్న ప్రయోగ పరీక్షను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాల్లో జియో ట్యాగింగ్ చేయాలని, కెమెరాలు పని చేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా పరీక్షలు జరుగుతున్న మరికొన్ని కళాశాలలను ఆయన తనిఖీ చేశారు.
News February 6, 2025
BREAKING: NZB: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం
ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధమైన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని ధర్మపురి హిల్స్కు చెందిన మొహమ్మద్ మొహియుద్దీన్ బుధవారం రాత్రి తన ఎలక్ట్రిక్ ఆటోను ఇంటి ఆవరణలో ఛార్జింగ్ పెట్టి ఇంట్లోకి వెళ్లాడు. గంట వ్యవధిలో ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ ఆటో పూర్తిగా దగ్ధమైంది.