News October 22, 2024
NZB: తండ్రిని హత్య చేసిన కొడుకు.. సహజ మరణంగా చిత్రీకరణ
నవీపేట మండలంలో దారుణం జరిగింది. తండ్రి తీరుతో తనకు పెళ్లి కావటం లేదని కుమారుడు తండ్రిని హత్య చేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతగిరికి చెందిన గౌరు అమృతం(55), అతని కుమారుడు మహిపాల్ ఆదివారం అర్ధరాత్రి మద్యం తాగారు. మద్యం మత్తులో ఉన్న అమృతం మెడకు టవల్ బిగించి హత్య చేశాడు. కాగా అందరికి సహజ మరణంగా నమ్మించాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా బంధువులు మెడకు ఉన్న గాయాలు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Similar News
News February 3, 2025
NZB: ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని నిజమాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను 141 అర్జీల రూపంలో అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
News February 3, 2025
NZB: బీజేపీ జిల్లా అధ్యక్షునిగా కులచారి దినేశ్
బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా కులచారి దినేశ్ రెండోసారి ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.కాసం వెంకటేశ్వర్లు ఓ ప్రకటన జారీ చేశారు. ఇటీవల జరిగిన సంస్థాగత ఎన్నికల సందర్భంగా దినేశ్ కులచారి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన రెండోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులు కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అరవింద్లకు కృతజ్ఞతలు తెలిపారు.
News February 3, 2025
NZB:100 మీటర్స్ హర్డిల్స్లో గోల్డ్ మెడల్
జాతీయస్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన పల్లవిరెడ్డి 100 మీటర్ల హార్డిల్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. కేరళ రాష్ట్రంలోని త్రిసూర్ జిల్లాలో జరుగుతున్న మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో భాగంగా 40 ఏళ్ల పై కేటగిరిలో పల్లవి గోల్డ్ మెడల్ సాధించారు. తెలంగాణకు చెందిన శివ లీల సిల్వర్ మెడల్, జయలక్ష్మి బ్రాంజ్ మెడల్ సాధించారు.