News December 12, 2024
NZB: తాగుబోతు ఎఫెక్ట్.. నిలిచిన ట్రాఫిక్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1733930722757_50139228-normal-WIFI.webp)
నిజామాబాద్ నీలకంఠేశ్వర దేవాలయం సమీపంలో ఓ తాగుబోతు బుధవారం రాత్రి హల్చల్ చేశాడు. అక్కడి ఓ వైన్స్ ఎదుట రోడ్డుకు అడ్డంగా కూర్చొని ట్రాఫిక్ కు అంతరాయం కలిగించాడు. దీంతో నిజామాబాద్- ఆర్మూర్ ప్రధాన రూట్ లో ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంబులెన్స్ సైతం ట్రాఫిక్లో చిక్కుకు పోయింది.
Similar News
News January 21, 2025
NZB: జిల్లా జడ్జిని కలిసిన రైతు కమిషన్ సభ్యులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737459310495_50316133-normal-WIFI.webp)
నిజామాబాద్ నగరంలోని జిల్లా జడ్జి సునీత కుంచాలను ఆమె కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించారు. పలు విషయాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి, ఆకుల రమేష్ న్యాయవాదులు పాల్గొన్నారు.
News January 21, 2025
NZB: పోగొట్టుకున్న బంగారాన్ని అప్పగించిన పోలీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737453502964_50486028-normal-WIFI.webp)
పోగొట్టుకున్న బంగారాన్ని బాధితుడికి అప్పగించినట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాద్ తెలిపారు. సోమవారం డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వ్యక్తికి ష్యూరిటీ కోసం జనార్దన్ స్టేషన్కు వెళ్లాడు. ఆ సమయంలో అతను 3 గ్రాముల బంగారాన్ని పోగొట్టుకున్నాడు. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైజుద్దీన్కి బంగారం దోరకడంతో మంగళవారం జనార్దన్కు ట్రాఫిక్ సీఐ అందజేశారు. నిజాయితీని చాటుకున్న కానిస్టేబుల్ను సీఐ అభినందించాడు.
News January 21, 2025
NZB: సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737447713057_50139228-normal-WIFI.webp)
సంక్షేమ పథకాలు అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామసభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా తదితర పథకాల కోసం అర్హత కలిగిన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.