News October 14, 2024
NZB: దసరా తరువాత సద్దుల బతుకమ్మ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలను దసరా పండగకు ముందే నిర్వహించుకుంటారు. అందుకు భిన్నంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో దసరా పండుగ తరువాత సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 15న పండగ నిర్వహించేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఏటా దసరా అనంతరం పౌర్ణమికి ముందు మంచిరోజు చూసి సద్దుల బతుకమ్మ పండుగ నిర్వహిస్తామని మండల ప్రజలు చెబుతున్నారు.
Similar News
News October 15, 2024
NZB: స్పెషల్ బస్సులు.. భారీగా RTC ధరలు
దసరా సెలవులు ముగిసిన నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా RTC అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారు. కాగా బోధన్ నుంచి NZBకు ఎక్స్ప్రెస్ బస్సు సాధారణ సమయాల్లో రూ.50 ఉండగా.. తాజాగా రూ.70 తీసుకుంటున్నారు. అదేంటని ప్రశ్నిస్తే దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశారని, అందుకే ధర పెంచినట్లు తెలిపారు. ఈ క్రమంలో కండక్టర్కు, ప్రయాణికుల మధ్య కాస్త వాగ్వాదం జరిగింది.
– మీ వద్ద ధరలు ఎలా ఉన్నాయి..?
News October 15, 2024
KMR: మంత్రాలు వేస్తున్నాడని కంట్లో కారం చల్లి కొట్టారు.. చివరికి కేసు
కామారెడ్డి జిల్లా అడ్లూర్ గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి మంత్రాలు వేస్తున్నాడనే నెపంతో గ్రామానికి చెందిన సాయిలు అనే వ్యక్తిని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి, కారంపొడి చల్లి కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో సాయిలు తలకు, కాళ్ల భాగాలలో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి ఫిర్యాదుతో వెంకోల్ల రాజు, వెంకోల్ల లక్ష్మణ్, స్వామి, గడ్డమీది లక్ష్మణ్పై కేసు నమోదుచేసినట్లు దేవునిపల్లి SI రాజు తెలిపారు.
News October 15, 2024
NZB: త్వరలో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ: మహేష్ కుమార్
త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. సోమవారం సాయంత్రం ఆయన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటి వరకు వివిధ కారణాలతో వాయిదా పడుతున్న మంత్రి వర్గ విస్తరణ త్వరలోనే జరుగుతుందని తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.