News June 7, 2024

NZB: ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్.. రూ. 6 లక్షలు స్వాధీనం

image

ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న షేక్ ఇస్మాయిల్(32)ను గురువారం అరెస్ట్ చేసినట్లు మెట్‌పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. మెట్పల్లి, కోరుట్ల, మల్లాపూర్ ఇబ్రహీంపట్నం మండలాలలో 25 వాహనాలను దొంగిలించాడు. వాటిని కమ్మర్ పల్లి, ఆర్మూర్, NZB, మోర్తాడ్, పెర్కిట్ లలో స్ర్కాప్ వ్యాపారం చేసే 15 మందికి ఒక్కొ వాహనాన్ని రూ. 5 వేల చొప్పున విక్రయించారు. కాగా అతని నుంచి రూ. 6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News October 3, 2024

NZB: డీఎస్సీ సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు 220 మంది హాజరు

image

డీఎస్సీ-2024 అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన బుధవారం ప్రారంభమైంది.ఈ మేరకు నిజామాబాద్ జిల్లాలో విద్యాశాఖ అధికారులు ఆయా జిల్లాల అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొదటిరోజు 220 మంది అభ్యర్థులు మాత్రమే హాజరయ్యారు. ఈ నెల 5 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతుందని, అభ్యర్థుల మొబైల్ ఫోన్లు, ఈమెయిల్‌కు సమాచారం వచ్చిన వారు మాత్రమే హాజరుకావాలని అధికారులు సూచించారు.

News October 2, 2024

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్

image

నిజామాబాద్ జిల్లా ప్రత్యేక అధికారిగా డాక్టర్ శరత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిందన్నారు. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో ఉమ్మడి జిల్లా అభివృద్ధి పనులు జరుగుతాయని పేర్కొన్నారు.

News October 2, 2024

బోధన్: రైలు బోగీలో ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

బోధన్ రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న ప్యాసింజర్ రైలులోని బోగీలో గుర్తుతెలియని వ్యక్తి మంగళవారం రాత్రి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. రైల్వే మేనేజర్ నవీన్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు రైల్వే స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్ఐ వెల్లడించారు.