News February 4, 2025
NZB: నగరంలో నేడు పవర్ కట్

నిజామాబాద్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్3 ADE వీరేశం తెలిపారు. వినాయక్ నగర్ సబ్స్టేషన్ పరిధిలో పలు మరమ్మతులు కారణంగా ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. గాయత్రి నగర్, 1, 2, 3, 4, 5, ఆకుల పాపయ్య కాలనీ, చింత చెట్టు మైసమ్మ, కాశీనగర్, సిద్ధి వినాయక నగర్, కెనాల్ కట్ట ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుంది.
Similar News
News December 10, 2025
NZB: తొలి విడతలో ఓటేసే వారు ఎంతమంది అంటే..?

తొలి విడతలో GP ఎన్నికలు జరిగే బోధన్, చందూర్, కోటగిరి, మోస్రా, వర్ని, పొతంగల్, రెంజల్, రుద్రూర్, సాలుర, ఎడపల్లి, నవీపేట మండలాల్లో 2,61,210 మంది ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇందులో మహిళలు 1,37,413 మంది మహిళలు, పురుషులు 1,23,790, ఇతరులు ఏడుగురు ఉన్నారు. కాగా 11 మండలాల్లో 1,653 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
News December 10, 2025
నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల ముచ్చట్లు

పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 155 స్థానాలకు 466 మంది పోటీలో నిలిచారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. 19 గ్రామాలు ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు 548 మంది బరిలో ఉన్నారు. గుర్తులు కేటాయించడంతో ప్రచార పర్వం మొదలైంది.
News December 10, 2025
NZB: బాబోయ్.. చంపేస్తున్న చలి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. జిల్లాలో వారం రోజులుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఉదయాన్నే బయటకు వెళ్లేవారు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో మంగళవారం 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మునుముందు చలి మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చలికితోడు పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో వాహనదారులు జాగ్రత్తగా వెళ్లండి.


