News May 11, 2024

NZB: నడిరోడ్డుపై కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ

image

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నేత మునిపల్లి సాయిరెడ్డికి ఇందల్వాయి మండల ప్రచార బాధ్యతలు అప్పగించగా ఎమ్మెల్యే భూపతి రెడ్డి సూచనల మేరకు ఆయన శనివారం మండలంలోని తిర్మన్పల్లి గ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో గౌరారం గ్రామానికి చెందిన సంతోష్‌తో గొడవ జరిగింది. మా ఇలాకాలో మీ పెత్తనం ఏంటని? సాయిరెడ్డిపై సంతోష్ నడిరోడ్డుపై గొడవకు దిగారు.

Similar News

News January 8, 2026

నిజామాబాద్: PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జన్నారపు రాజేశ్వర్

image

PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా NZBకు చెందిన జన్నారపు రాజేశ్వర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్‌లో 3 రోజుల పాటు నిర్వహించిన PDSU 23వ రాష్ట్ర మహాసభల్లో ఆయన్ను ఎన్నుకున్నారు. జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ.. జిల్లాలో విద్యా వ్యతిరేక విధానాలపై, విద్యా రంగ సమస్యలపై విద్యార్థి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోతామన్నారు. స్థానిక సమస్యలపై నిరంతరం పోరాడుతనని పేర్కొన్నారు.

News January 8, 2026

NZB: ఈవీఎం గోడౌన్‌‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అగ్ని మాపక అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

News January 8, 2026

నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్‌లో పసుపు బోర్డు ఛైర్మన్

image

మైసూర్‌లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.