News March 18, 2025
NZB: నిజామాబాద్ నుంచి సిద్దిపేటకు నూతన బస్సులు

నిజామాబాద్ జిల్లా నుంచి సిద్దిపేటకు నూతన ఎలక్ట్రిక్ ఎక్స్ప్రెస్ బస్సులను ప్రారంభిస్తున్నట్లు NZB-2 డిపో మేనేజర్ సాయన్న సోమవారం తెలిపారు. ఈ బస్సులు నిజామాబాదు నుంచి కామారెడ్డి మీదుగా సిద్దిపేట వరకు నడపనున్నట్లు వెల్లడించారు. కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. సురక్షితమైన, సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సంస్థను ఆదరించాలని తెలిపారు.
Similar News
News March 19, 2025
ఉమ్మడి MBNR యువతకు సువర్ణవకాశం

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో ఉమ్మడి MBNR జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2న అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లాలో 48వేల మందికి పైగా యువతకు లబ్ధిచేకూరనుంది. ఒక్కో నియోజకవర్గానికి 4వేలకు పైగా యూనిట్లు మంజూరు చేయనున్నారు. అవసరమైన వారికి SHARE IT.
News March 19, 2025
నంద్యాల జిల్లాలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

నంద్యాల జిల్లాలో మంగళవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా బండి ఆత్మకూరు, పెద్ద దేవళాపురంలో 42.7°C, చాగలమర్రిలో 42.4°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. గోస్పాడు 41.9°, దొర్నిపాడు 41.7° ఆత్మకూరు 41.5°, కొత్తపల్లి 41.4°, పగడ్యాల మండలాల్లో 41.1° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 19, 2025
రాజన్న సిరిసిల్ల: బడ్జెట్పైనే భారమంతా..!

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ఉమ్మడి KNR జిల్లా ప్రజలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్లో జిల్లాలోని వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, ఓదెల, కాళేశ్వరం, ఇల్లందకుంట ఆలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. జమ్మికుంట బస్సు డిపో ఏర్పాటు, కల్వల రిజర్వాయర్కు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఉమ్మడి KNR జిల్లాకు ఇంకేం కావాలో కామెంట్ చేయండి.