News October 4, 2024

NZB: నేడు నగరానికి రానున్న TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్

image

నూతన TPCC అధ్యక్షునిగా నియమింపబడిన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం మొదటిసారి నిజామాబాద్ జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. అలాగే బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో పలువురు రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు.

Similar News

News December 14, 2025

నిజామాబాద్: 1PM UPDATE 72.56 శాతం

image

రెండో దశ ఎన్నికల్లో మధ్యాహ్నం 1 గంట వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 72.56 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది….
* ధర్పల్లి మండలంలో 68.30%,
* డిచ్‌పల్లి-62.68%
* ఇందల్వాయి-75.29%
* జక్రాన్‌పల్లి-72.80%
* మాక్లూర్-76.66%
* మోపాల్- 78.95%
* NZB రూరల్-80.47%
* సిరికొండ-73.13% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

News December 14, 2025

NZB: ఓటు హక్కు వినియోగించుకున్న BJP జిల్లా అధ్యక్షుడు

image

రెండో విడుత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీజేపీ NZB జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి ఆదివారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. సొంత గ్రామమైన అమృతపూర్‌లో ఓటు వేశారు. దినేష్ కులాచారి మాట్లాడుతా.. ఈ రోజు నా సొంత గ్రామంలో ఓటు వేయడం సంతోషంగా ఉందన్నారు. గ్రామానికి సేవ చేసే వారికీ నా మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

News December 14, 2025

NZB: 11 గంటల వరకు 49.13 శాతం పోలింగ్

image

రెండో దశ ఎన్నికల్లో పోలింగ్ మొదలైన నాలుగు గంటల్లో ఉదయం 11 గంటల వరకు 8 మండలాల్లోని 158 GPల్లో 158 SPలకు, 1,081WMలకు 49.13 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం మండలాల వారీగా ఇలా ఉంది.
* ధర్పల్లి మండలంలో 53.59%,
* డిచ్‌నపల్లి-35.36%
* ఇందల్వాయి-50.45%
* జక్రాన్‌పల్లి-55.16%
* మాక్లూర్-56.25%
* మోపాల్- 55.17%
* NZB రూరల్-60.28%
* సిరికొండ-38.49% పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.