News January 31, 2025
NZB: పట్టభద్రులు మేల్కోండి… నేడే చివరి రోజు

ఉమ్మడి నిజామాబాద్,కరీంనగర్, మెదక్, అదిలాబాద్ జిల్లా పట్టభద్రుల మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీ చేస్తామనుకున్న వారు క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. పట్టభద్రులను, ఉపాధ్యాయులను కలుస్తూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ నమోదుగా దరఖాస్తుల స్వీకరణ నేటితో ముగియనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు ఓటర్ నమోదుకు ఇదే చివరి అవకాశం కానుంది.
Similar News
News December 6, 2025
NZB: ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడండి: MP

ప్రభుత్వ టీచర్లకు తప్పని సరి అనే నిబంధనల విషయంలో చాలా ఏళ్లుగా సేవ చేస్తున్న ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి దర్మేంద్ర ప్రధాన్ను MP అర్వింద్ ధర్మపురి కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఒక వినతిపత్రం అందజేసిన ఎంపీ మాట్లాడుతూ NZBలోక్ సభ నియోజకవర్గ పరిధిలో దాదాపు 3వేల మంది ఉపాధ్యాయులపై ఈ టెట్ తప్పనిసరి అంశం ప్రభావం చూపుతోందని వివరించారు.
News December 6, 2025
NZB: మూడు రోజుల్లో నామినేషన్లు ఎన్నంటే?

ఆలూరు 11 GPల్లో SP 58, WM- 273, ARMR14 GPల్లో SP 105, WM 387, బాల్కొండ 10 GPల్లో SP 76, WM 237, BMGL 27 GPల్లో SP 175, WM 577, డొంకేశ్వర్ 13 GP ల్లో SP 65 , WM 223, మెండోరా 11 GPల్లో SP 63, WM 270, మోర్తాడ్ 10 GPల్లో SP 70, WM 294, ముప్కాల్ 7 GPల్లో SP 65, WM 246, NDPT 22 GPల్లో SP 133, WM 571, వేల్పూర్ 18 GPల్లో SP 121, WM 426, ఏర్గట్ల 8 GPల్లో SP 49, WM 174, కమ్మర్పల్లి 14 GPల్లో SP97, WM 343.
News December 6, 2025
నిజామాబాద్: 3వ రోజు 2,975 నామినేషన్లు

NZB జిల్లాలో 3వ విడత GP ఎన్నికల్లో భాగంగా 3వ రోజైన శుక్రవారం 2,975 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఆలూరు, ఆర్మూర్, బాల్కొండ, భీమ్గల్, డొంకేశ్వర్, కమ్మర్పల్లి, మెండోరా, మోర్తాడ్, ముప్కాల్, నందిపేట్, వేల్పూర్, ఏర్గట్ల మండలాల పరిధిలోని 165 గ్రామ పంచాయతీల సర్పంచి స్థానాల కోసం 608 మంది, 1,620వార్డు మెంబర్ స్థానాలకు 2,367 మంది నామినేషన్లు వేశారు. 3 రోజుల్లో SPలకు 1,077, WMలకు 4,021 నామినేషన్లు వచ్చాయి.


