News March 6, 2025
NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
Similar News
News December 1, 2025
వరంగల్లో నైపుణ్యాభివృద్ధిపై ఎంపీ కావ్య ప్రశ్న

బలహీన వర్గాల అభివృద్ధి దిశగా చర్యలు చేపట్టాలని ఎంపీ కడియం కావ్య పార్లమెంట్లో కేంద్రాన్ని కోరారు. వరంగల్లో నైపుణ్యాభివృద్ధి పథకాల అమలు, లోపాలపై ఆమె పార్లమెంట్లో ప్రశ్నించారు. పీఎంకేవీవై ప్రారంభం నుంచి ఎనిమిది శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రస్తుతం అమలులో ఉన్న 4.0లో ఒక్క కేంద్రం కూడా పనిచేయకపోవడంపై ఎంపీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
News December 1, 2025
నంద్యాల పీజీఆర్ఎస్కు 278 దరఖాస్తులు

ప్రజా పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజల నుంచి 278 ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అర్జీల ఆడిట్ను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రీ ఓపెన్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.
News December 1, 2025
HYD మెట్రోలో ట్రాన్స్జెండర్లకి ఉద్యోగాలు

తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు పోలీస్ శాఖలోనే కాకుండా మెట్రో రైల్లో సైతం ట్రాన్స్జెండర్లకి ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నారు. ఇటీవల సుమారు 20 మందిని ఎంపిక చేసిన మెట్రో అధికారులు వారికి శిక్షణ ఇచ్చారు. నేటి నుంచి ట్రాన్స్జెండర్లు వారికి కేటాయించిన మెట్రో స్టేషన్లలో సేవలు అందిస్తున్నారు. రైళ్ల రాకపోకల వివరాలతో పాటు, మహిళా ప్రయాణికుల భద్రత విషయంలో ప్రముఖ పాత్ర వహించనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు


