News March 6, 2025
NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.
Similar News
News November 23, 2025
బాపట్ల: 2.50 లక్షల గోనె సంచులు సిద్ధం

ధాన్యం సేకరణలో రవాణా ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన విశిష్ట తెలిపారు. 1,200 వాహనాలు అవసరం కానున్నాయని అంచనా వేశామన్నారు. ఇప్పటికే 450 వాహనాలు పోర్టల్లో నమోదు చేసుకున్నారని, ప్రతి వాహనానికి జిపిఎస్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. 2.50 లక్షల గోనె సంచులు సిద్ధంగా ఉంచామన్నారు. మిల్లర్ల వద్ద మరో 10లక్షల గోనె సంచులు ఉన్నాయన్నారు.
News November 23, 2025
MNCL: DCC అధ్యక్షుడు రఘునాథరెడ్డి రాజకీయ ప్రస్థానం

మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన పిన్నింటి రఘునాథరెడ్డి రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. 1990లో ఎన్ఎస్యూఐ పాఠశాల అధ్యక్షుడిగా, 2004-2006 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షుడిగా పనిచేశారు. 2007 నుంచి 2012 వరకు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఆపై 2013-2023 వరకు టీపీసీసీ కార్యదర్శిగా, 2023 నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు.
News November 23, 2025
1, 2, 3 ఇవి ర్యాంకులు కాదు.. కరీంనగర్ – జమ్మికుంట బస్సులు

కరీంనగర్ – అన్నారం – చల్లూర్ – వీణవంక – జమ్మికుంట రూట్లో బస్సుల రాకపోకలపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు వస్తున్నా, ఆ తర్వాత ఈ రూట్లో ఒక్కోసారి ఒకేసారి మూడు బస్సులు వస్తాయని, లేదంటే గంట, గంటన్నర వరకు బస్సులే ఉండవని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, సమయపాలనను సరిచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


