News March 6, 2025

NZB: పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది: కవిత

image

కరీంనగర్ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఓడిపోయిందని BRS ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బీసీయేతర అభ్యర్థులను బరిలోకి దింపాయని, పార్టీలపరంగా, సిద్ధాంతపరంగా ఓట్లు చీలాయన్నారు. కాబట్టి పోటీలో ఉన్న బీసీ అభ్యర్థి హరికృష్ణ గెలవలేదని ఆమె అన్నారు. బీసీ రిజర్వేషన్లు ఉంటే ఆ స్థానంలో కచ్చితంగా అన్ని పార్టీలు బీసీకే టికెట్ ఇచ్చేవని వ్యాఖ్యానించారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నారు.

Similar News

News February 7, 2026

WGL: నేడు పరీక్ష.. 2,486 మంది అభ్యర్థుల పోటీ

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 9, 11 తరగతుల ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నట్లు ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. 11వ తరగతికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, 9వ తరగతికి ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 2,486 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

News February 7, 2026

WGL: నేడు పరీక్ష.. 2,486 మంది అభ్యర్థుల పోటీ

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 9, 11 తరగతుల ప్రవేశ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శనివారం జిల్లా వ్యాప్తంగా 11 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నట్లు ప్రిన్సిపల్ పూర్ణిమ తెలిపారు. 11వ తరగతికి ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, 9వ తరగతికి ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 2,486 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు.

News February 7, 2026

చెరువుగట్టు హుండీల లెక్కింపు.. గతేడాదికంటే అధికం

image

చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడలరామలింగేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీల లెక్కింపు నిర్వహించారు. గట్టు క్రింద అమ్మవారి ఆలయ హుండీ ఆదాయం రూ.3,79,467 కాగా, గట్టు పైన స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ.22,34,770 నమోదైంది. మొత్తం 16 రోజుల హుండీ ఆదాయం రూ.26,14,237 కాగా, అన్నదానానికి రూ.46,739లు వచ్చాయి. గత సంవత్సరం ఆదాయంతో పోల్చితే ఈ సంవత్సరం రూ.9,69,137 అధికంగా వచ్చిందని ఈవో మోహన్ బాబు తెలిపారు.