News February 14, 2025

NZB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

image

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

Similar News

News October 15, 2025

అమర్నాథ్‌‌కు డేటా సెంటర్ అంటే ఏంటో తెలుసా?: లోకేశ్

image

అమర్నాథ్‌పై మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. ‘YCP హయాంలో IT మంత్రిని అందరూ ట్రోల్ చేశారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు. ఒక ప్రశ్న అడిగితే కోడి.. గుడ్డు.. గుడ్డు.. కోడి అన్నాడు. అయనకు డేటా సెంటర్ అంటే ఎంటో తెలుసా? గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌‌‌‌లో ఒక్క గ్లోబల్ కంపెనీ పేరు కూడా చెప్పలేకపోయాడు. డేటా సెంటర్ వలన అనుబంధ సంస్థలు వస్తాయి. దీంతో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి’ అని లోకేశ్ పేర్కొన్నారు.

News October 15, 2025

ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

మనుబోలు(M) కాగితాలపూరు క్రాస్ రోడ్‌లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదలలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్(18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరుకు తరలించారు.

News October 15, 2025

HYD: కనీసం శుభ్రతకు నోచుకోని కలాం విగ్రహం

image

21వ శతాబ్దపు మహోన్నత వ్యక్తి, అణుశాస్త్రవేత్త, భారతదేశ 11వ రాష్ట్రపతి భారతరత్న Dr.APJ అబ్దుల్ కలాం జయంతి నేడు. చిన్నచిన్న గల్లి లీడర్లకు సైతం విగ్రహాలు పెట్టి పాలాభిషేకాలు చేసే నాయకులు మహోన్నత వ్యక్తి జయంతిని గుర్తుంచుకోకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనస్థలిపురం రెడ్‌ట్యాంక్ వద్ద ఉన్న అబ్దుల్ కలాం విగ్రహం కనీసం శుభ్రం చేయడానికి కూడా నోచుకోకపోవడం గమనార్హం