News January 19, 2025
NZB: పథకాలపై కలెక్టరేట్లో సమీక్ష ప్రారంభం

రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై ఉమ్మడి జిల్లా అధికారులతో ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ధన్పాల్, రాకేశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News December 1, 2025
అయిజ: “Way2News ఎఫెక్ట్” ఎట్టకేలకు నామినేషన్ దాఖలు

అయిజ మండలం ఉత్తనూర్ సర్పంచ్ స్థానానికి హాలియా దాసరి జయమ్మ నామినేషన్ వేసే ప్రయత్నం చేయగా అదే సామాజిక వర్గానికి చెందిన వారు బెదిరింపులకు గురి చేశారు. ఈ విషయమై Way2News లో సోమవారం ఉదయం “ఉత్తనూరులో హాలియా దాసర్లకు బెదిరింపులు” శీర్షికన కథనం ప్రచురితమైంది. కథనానికి మండల అధికారులు స్పందించి గ్రామానికి చేరుకున్నారు. వారిని కలిసి సాయంత్రం నామినేషన్ వేయించారు. వే2న్యూస్కు గ్రామస్థులు అభినందించారు.
News December 1, 2025
సంగారెడ్డి: నేషనల్ హైవే పురోగతిపై కలెక్టర్ సమీక్ష

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నేషనల్ హైవే 65 పనుల పురోగతిపై కలెక్టర్ ప్రావీణ్య సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. హైవే పనుల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, అదనపు ఎస్పీ రఘునందన్ రావు పాల్గొన్నారు.
News December 1, 2025
కాంగ్రెస్కు శశిథరూర్ దూరం అవుతున్నారా?

కాంగ్రెస్కు ఆ పార్టీ MP శశిథరూర్కు మధ్య విభేదాలు ముదిరినట్లు తెలుస్తోంది. ఇటీవల SIRపై పార్టీ నిర్వహించిన భేటీకి ఆయన గైర్హాజరయ్యారు. అనారోగ్యం వల్లే వెళ్లలేదని చెప్పారు. కానీ తర్వాతి రోజే PM పాల్గొన్న ఓ ప్రోగ్రామ్కు వెళ్లారు. తాజాగా పార్లమెంట్ సెషన్స్ ముందు జరిగిన పార్టీ మీటింగ్కూ హాజరుకాలేదు. ట్రావెలింగ్లో ఉన్నందునే తాను రాలేదని ఆయన చెబుతున్నప్పటికీ INCకి దూరమవుతున్నారనే చర్చ జరుగుతోంది.


