News March 1, 2025

NZB: పరీక్షల నిర్వహణపై కలెక్టర్ కీలక సూచనలు

image

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులకు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కీలక సూచనలు చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన అధికారులతో మాట్లాడుతూ ఎలాంటి పొరపాట్లకు, కాపీయింగ్‌ జరగకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షల అనంతరం ఆన్సర్ షీట్లను నిర్ణీత పాయింట్ కు తరలించే జాగ్రత్తగా ఉండాలన్నారు.

Similar News

News March 1, 2025

నిజామాబాద్ జిల్లాలో పెరిగిన ఎండ తీవ్రత

image

నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు చలి తీవ్రత విపరీతంగా ఉండగా.. గత రెండు మూడు రోజుల నుంచి ఎండ పెరిగింది. దీంతో పొలం పనులు, ఇతర పనులకు వెళ్లే నిజామాబాద్ వాసులు భయపడుతున్నారు. నిజామాబాద్‌లో ఇవాళ, రేపు 36°C ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉందో కామెంట్ చేయండి.

News March 1, 2025

NZB: ఇంటర్ పరీక్షలకు 36,222 మంది విద్యార్థులు

image

మార్చ్‌ 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని NZB DIEO రవికుమార్ తెలిపారు. జిల్లాలో 36,222 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు వివరించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 17,789 మంది, రెండో సంవత్సరంలో 18,433 మంది పరీక్షలు రాయనున్నారు. ఇందు కోసం 57 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది.

News March 1, 2025

NZB: ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్‌లో జిల్లా క్రీడాకారులు

image

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నీలో జిల్లాకు చెందిన ఇద్దరు క్రీడాకారులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీలోని కాకినాడలో జరుగుతున్న ఈ టోర్నమెంట్‌లో జిల్లాకు చెందిన జి. సుమన్, ఆర్.శివకుమార్ రీజినల్ స్పోర్ట్స్ బోర్డ్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే సుమన్ హైదరాబాదులోని ఏజీ ఆఫీస్‌లో సీనియర్ ఆడిటర్‌గా, శివకుమార్ స్థానిక ఇన్కమ్ టాక్స్ ఆఫీస్‌లో ఓఎస్‌గా పనిచేస్తున్నారు.

error: Content is protected !!