News October 22, 2024
NZB: పలు హోటళ్లలో మున్సిపల్ అధికారుల తనిఖీలు, జరిమానాలు

నిజామాబాద్ నగరంలోని పలు హోటళ్లలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించినట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్ తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న వంట గదులను గమనించి శుభ్రంగా ఉంచాలని హెచ్చరించి, ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకుని జరిమానాలు విధించామన్నారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తున్న శాతవాహన హోటల్ కు రూ.2000 జరిమానా విధించినట్లు చెప్పారు.
Similar News
News July 6, 2025
పొతంగల్: అబార్షన్ అయ్యిందని వివాహిత ఆత్మహత్య

అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News July 6, 2025
NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.
News July 6, 2025
NZB: VRకు ఏడుగురు SI

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.